Site icon NTV Telugu

ఆంధ్రప్రదేశ్ కరోనా అప్డేట్…

ap corona

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుతూ… పెరుగుతూ వస్తుంది. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. రాష్ట్రం లో గత 24 గంటల్లో 54,455 శాంపిల్స్‌ పరీక్షించగా.. 1,321 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 19 మంది కరోనా బాధితులు ప్రాణాలు వదిలారు. ఇక, ఒకేరోజు 1,499 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. రాష్ట్రంలో నేటి వరకు 2,64,71,272 శాంపిల్స్‌ పరీక్షించగా.. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,10,566కు చేరింది… రికవరీ కేసుల సంఖ్య 19,81,906 కు పెరగగా… ఇప్పటి వరకు మృతిచెందిన కోవిడ్‌ బాధితుల సంఖ్య 13,807కు పెరిగింది.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 14,853 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది ఏపీ ప్రభుత్వం.

Exit mobile version