Site icon NTV Telugu

ఏపీలో నేడు ఎన్ని కరోనా కేసులంటే..?

ఏపీలో కరోనా కేసులు పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. ఇక ఇవాళ ఏపీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 29, 228 శాంపిల్స్‌ పరీక్షించగా.. 132 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. మరో ఒక్క కోవిడ్‌ బాధితుడు మృతి చెందారు. ఇక, ఇదే సమయంలో 186 మంది కోవిడ్‌ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,08,27,634 కు చేరుకోగా… మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,75,108 కు పెరిగింది.. ఇక, 20,58,817 మంది పూర్తిస్థాయిలో కోలుకోగా.. 14,468 మంది కోవిడ్‌ బాధితులు మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్‌ కేసులు 1,823 గా ఉన్నాయని పేర్కొంది ఏపీ ప్రభుత్వం.

Exit mobile version