Site icon NTV Telugu

ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు…

corona

ఏపీలో క‌రోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. నిన్న ఉద‌యం 9 గంట‌ల నుంచి ఈరోజు ఉద‌యం 9 గంట‌ల వ‌ర‌కు 55,323 శాంపిల్స్‌ను ప‌రీక్షించగా, 1,246 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 20,44,490 కి చేరింది. ఇందులో 20,16,837 మంది కోలుకొని డిశ్చార్జ్ అయిన‌ట్టు బులిటెన్‌లో పేర్కొన్నారు. 24 గంట‌ల్లో రాష్ట్రంలో 1,450 మంది క‌రోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక‌పోతే, రాష్ట్రంలో ప్రస్తుతం 13,535 యాక్టీవ్ కేసులు ఉన్నట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ బులిటెన్ పేర్కొన్నది. రాష్ట్రంలో కొత్తగా క‌రోనాతో 10 మంది మృతి చెందారు. ఇప్పటి వ‌ర‌కు ఆంధ్రప్రదేశ్‌లో న‌మోదైన మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 14,118 కి చేరింది.

Exit mobile version