ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు ప్రతీ రోజూ వెయ్యికి పైగానే నమోదు అవుతూ వస్తున్నాయి.. అయితే, గత బులెటిన్ కంటే.. ఇవాళ కాస్త తక్కువ కేసులే వెలుగుచూశాయి.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 58,054 శాంపిల్స్ పరీక్షించగా.. 1,010 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 13 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో 1,149 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది సర్కార్. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 2,82,93,704 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,45,657కు పెరిగింది.. ఇక, రికవరీ కేసులు 20,50,324కు చేరుకోగా.. ఇప్పటి వరకు మృతిచెందినవారి సంఖ్య 14,176 కు చేరిందని.. ప్రస్తుతం 11,503 యాక్టివ్ కేసులు ఉన్నాయని బులెటిన్లో పేర్కొంది ఏపీ ప్రభుత్వం.
ఏపీ కరోనా : ఈరోజు ఎన్ని కేసులంటే..?
ap corona