Tirumala Adulterated Ghee Case: తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం.. ముగిసిన ఏక సభ్య కమిషన్ విచారణ..
- తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో ముగిసిన ఏకసభ్య కమిషన్ విచారణ..
- ఈ నెల 30న ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించనున్న దినేశ్ కుమార్..
- వైసీపీ హయాంలో టెండర్ నిబంధనల సడలింపుపై కీలక ఆధారాల సేకరణ..
Tirumala Adulterated Ghee Case: సంచలనం సృష్టించిన తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై నియమించిన ఏక సభ్య కమిషన్ క్షేత్రస్థాయి విచారణ ముగిసింది. దినేశ్ కుమార్ కమిషన్ టీటీడీ అధికారుల నుంచి కీలక దస్త్రాలు, టెండర్ నిబంధనల డేటా సేకరించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన నిబంధనల సడలింపుపై ఆరా తీసిన కమిషన్, ఈ నెల 30న సీఎస్ కు రిపోర్ట్ ఇచ్చేందుకు అమరావతికి బయలుదేరింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేశ్ కుమార్ నేతృత్వంలోని ఈ కమిషన్, గత రెండు రోజులుగా తిరుపతి, తిరుమలలో పర్యటించి కీలక ఆధారాలను సేకరించింది. తిరుపతిలోని శ్రీపద్మావతి అతిథి గృహంలో ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్న కమిషన్, విచారణ ముగించుకుని అమరావతికి బయలుదేరింది.
Also Read
- TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఇవాళ్టి నుంచే జులై నెల దర్శన టికెట్ల విడుదల
- TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సర్వదర్శనం టోకెన్ల సమయంలో మార్పులు..
- TTD Server Issue: టీటీడీ సర్వర్లో సాంకేతిక లోపం.. ఆన్లైన్ టికెట్ల జారీ రద్దు..
- Tirumala Devotees Record: రికార్డు స్థాయిలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు.. ఏడాదిలో 2.67 కోట్ల మందికి దర్శనం..
వైసీపీ ప్రభుత్వ హయాంలో నెయ్యి కొనుగోలు ప్రక్రియలో జరిగిన అక్రమాలపై కమిషన్ లోతుగా ఆరా తీసింది. అప్పట్లో టెండర్ నిబంధనలను ఎందుకు, ఎలా సడలించారనే అంశంపై టీటీడీ ఉన్నతాధికారులను ప్రశ్నించింది. టీటీడీ ముఖ్య ఆర్థిక గణాంక సలహాదారు బాలాజీ నుంచి గత పాలకమండలి నిర్ణయాలకు సంబంధించిన దస్త్రాలను సేకరించింది. అలాగే మార్కెటింగ్, ప్రొక్యూర్మెంట్ విభాగాల అధికారులతో పాటు ఎక్స్పర్ట్ కమిటీ సభ్యుడు విజయభాస్కర్ రెడ్డి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 20న ఈ ఏక సభ్య కమిషన్ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి 45 రోజుల్లో నివేదిక సమర్పించాల్సి ఉండగా.. వరుస సెలవులు రావడం, కొందరు అధికారులు విచారణకు సకాలంలో హాజరుకాకపోవడంతో గడువు పొడిగించారు. ఈ నెల 30వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కమిషన్ తన తుది నివేదికను సమర్పించనుంది. నెయ్యి నాణ్యత పరీక్షల్లో వైఫల్యాలు, టెండర్ల ఖరారులో జరిగిన లోపాలను ఈ నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం.
తాజావార్తలు
-
Tirumala Adulterated Ghee Case: తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం.. ముగిసిన ఏక సభ్య కమిషన్ విచారణ..
-
Kavitha New Party: నేడే కవిత కొత్త పార్టీ ప్రకటన.. గన్ పార్క్ నుంచి మేడ్చల్ వరకు భారీ ర్యాలీ!
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
-
Iran-US Talks: నేడు ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్-అమెరికా మధ్య కీలక చర్చలు.. సర్వత్రా ఉత్కంఠ
-
RTC Strike Ends: ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఇక సమ్మె క్లోజ్!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!