Tirumala Adulterated Ghee Case: తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం.. ముగిసిన ఏక సభ్య కమిషన్ విచారణ..
- తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో ముగిసిన ఏకసభ్య కమిషన్ విచారణ..
- ఈ నెల 30న ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించనున్న దినేశ్ కుమార్..
- వైసీపీ హయాంలో టెండర్ నిబంధనల సడలింపుపై కీలక ఆధారాల సేకరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala Adulterated Ghee Case: సంచలనం సృష్టించిన తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై నియమించిన ఏక సభ్య కమిషన్ క్షేత్రస్థాయి విచారణ ముగిసింది. దినేశ్ కుమార్ కమిషన్ టీటీడీ అధికారుల నుంచి కీలక దస్త్రాలు, టెండర్ నిబంధనల డేటా సేకరించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన నిబంధనల సడలింపుపై ఆరా తీసిన కమిషన్, ఈ నెల 30న సీఎస్ కు రిపోర్ట్ ఇచ్చేందుకు అమరావతికి బయలుదేరింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేశ్ కుమార్ నేతృత్వంలోని ఈ కమిషన్, గత రెండు రోజులుగా తిరుపతి, తిరుమలలో పర్యటించి కీలక ఆధారాలను సేకరించింది. తిరుపతిలోని శ్రీపద్మావతి అతిథి గృహంలో ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్న కమిషన్, విచారణ ముగించుకుని అమరావతికి బయలుదేరింది.
Also Read
- Trisha Visits Tirumala: తమిళనాడు ఫలితాల ముందు తిరుమలలో హీరోయిన్ త్రిషా దర్శనం.. టీవీకే విజయానికి ప్రార్థనలు..?
- TTD Laddu Report: తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక.. కీలక అంశాలు వెలుగులోకి తెచ్చిన ఏక సభ్య కమిటీ..
- TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఇవాళ్టి నుంచే జులై నెల దర్శన టికెట్ల విడుదల
- TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సర్వదర్శనం టోకెన్ల సమయంలో మార్పులు..
వైసీపీ ప్రభుత్వ హయాంలో నెయ్యి కొనుగోలు ప్రక్రియలో జరిగిన అక్రమాలపై కమిషన్ లోతుగా ఆరా తీసింది. అప్పట్లో టెండర్ నిబంధనలను ఎందుకు, ఎలా సడలించారనే అంశంపై టీటీడీ ఉన్నతాధికారులను ప్రశ్నించింది. టీటీడీ ముఖ్య ఆర్థిక గణాంక సలహాదారు బాలాజీ నుంచి గత పాలకమండలి నిర్ణయాలకు సంబంధించిన దస్త్రాలను సేకరించింది. అలాగే మార్కెటింగ్, ప్రొక్యూర్మెంట్ విభాగాల అధికారులతో పాటు ఎక్స్పర్ట్ కమిటీ సభ్యుడు విజయభాస్కర్ రెడ్డి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 20న ఈ ఏక సభ్య కమిషన్ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి 45 రోజుల్లో నివేదిక సమర్పించాల్సి ఉండగా.. వరుస సెలవులు రావడం, కొందరు అధికారులు విచారణకు సకాలంలో హాజరుకాకపోవడంతో గడువు పొడిగించారు. ఈ నెల 30వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కమిషన్ తన తుది నివేదికను సమర్పించనుంది. నెయ్యి నాణ్యత పరీక్షల్లో వైఫల్యాలు, టెండర్ల ఖరారులో జరిగిన లోపాలను ఈ నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం.
తాజావార్తలు
-
Hantavirus Outbreak: హంటావైరస్ కలకలం.. లక్షణాలు, చికిత్సపై WHO కీలక హెచ్చరిక.. కొత్త మహమ్మారిగా మారుతుందా..?
-
PM Modi: పరాన్నజీవి కాంగ్రెస్, డీఎంకేను వెన్నుపోటు పొడిచింది.. ప్రధాని మోడీ ఫైర్..
-
CSK vs LSG: నేడు చెపాక్లో అసలైన యుద్ధం.. ఈ మ్యాచ్లో అయిన ధోనీ ఉంటాడా?
-
IPL 2026: ఆర్సీబీకి తలనొప్పిగా మారిన ఇద్దరు స్టార్ ప్లేయర్లు.. కోట్లు ఖర్చు చేసినా ఫలితం శూన్యం..!
-
Elvish Yadav: ప్రముఖ యూట్యూబర్ ఎల్విష్ యాదవ్కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు!