NTV Telugu Site icon

TTD: తిరుమలలో తగ్గిన రద్దీ.. సిఫార్సు లేఖల దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం

Ttd

Ttd

TTD: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి అనునిత్యం ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు.. ఇక, సెలవు రోజుల్లో ఆ సంఖ్య మరింత భారీగా ఉంటుంది.. వేసవి సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని.. సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా.. సిఫార్సు లేఖలపై శ్రీవారి బ్రేక్‌ దర్శనాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. అయితే, తిరుమలలో భక్తుల రద్దీ సాదారణంగానే ఉంది.. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ తగ్గిన నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.. శ్రీవారి బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలను తిరిగి స్వీకరించాలని నిర్ణయించింది టీటీడీ.. మే 15వ తేదీ నుంచి.. అంటే ఎల్లుండి నుంచి సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలు కేటాయింపు పునః ప్రారంభించనున్నట్టు టీటీడీ పేర్కొంది.. దీనిపై ఇవాళ సాయంత్రం అధికారికంగా ప్రకటన విడుదల చేయనుంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)..

Read Also: Kayadu Lohar : కైపెక్కించే కళ్ళతో.. కాక రేపుతున్న కయాదు లోహర్‌