Droupadi Murmu Visits Tirumala: రాష్ట్రపతి తిరుమల పర్యటనలో ఆసక్తికర పరిణామం..
- తిరుమలలో శ్రీవారిని దర్శించుకన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..
- ద్రౌపది ముర్ము తిరుమల పర్యటనలో ఆసక్తికర పరిణామం..
- రాంభగీచ సర్కిల్ వద్ద ప్రోటోకాల్ పక్కన పెట్టేసిన రాష్ట్రపతి..
- కాన్వాయ్ నుంచి దిగి రోడ్డు పక్కన నిలిచిఉన్న భక్తులకు పలకరింపు..
- భక్తులతో కరచాలనం చేసి చాక్లెట్స్ పంపిణీ
Droupadi Murmu Visits Tirumala: ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఇవాళ ఉదయం కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి ఆలయ మహాద్వారం వద్ద రాష్ట్రపతికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్.. టీటీడీ అర్చకులు.. ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. ఇక, శ్రీవారిని దర్శించుకన్న తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్మకు అర్చకులు వేదాశీర్వచనాలిచ్చి.. తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి స్వామివారి చిత్రపటాన్ని అందించారు..
Read Also: Earthquake: బంగ్లాదేశ్, కోల్కతాలో భూకంపం.. భయంతో ప్రజలు పరుగులు
అయితే, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమల పర్యటనలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.. రాంభగీచ సర్కిల్ వద్ద ప్రోటోకాల్ పక్కన పెట్టేసి భక్తులను పలకరించారు రాష్ట్రపతి ముర్ము.. కాన్వాయ్ నుంచి దిగి రోడ్డు పక్కన నిలిచిఉన్న భక్తులను ప్రేమగా పలకరించిన రాష్ట్రపతి.. భక్తులతో కరచాలనం చేసి చాక్లెట్స్ పంపిణీ చేశారు.. ఇక, ఊహించని ఘటనతో భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.. అయితే, రాష్ట్రపతి అనూహ్యంగా కాన్వాయ్ దిగడంతో.. భద్రతా సిబ్బంది ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. కాగా, ఆంధ్రప్రదేశ్లో రెండు రోజుల పర్యటన భాగంగా.. గురువారం తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఆ తర్వాత తిరుమల చేరుకుని శ్రీపద్మావతి విశ్రాంతి గృహంలో బస చేశారు.. ఈ రోజు ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు..
తాజావార్తలు
-
KTR: “పీసీ ఘోష్ కాదు, ఇది పీసీసీ నివేదిక”.. బీఆర్ఎస్ వాదనే నిజమైందన్న కేటీఆర్..
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
Hyderabad Metro: ఆర్టీసీ కార్మికుల సమ్మే వేళ.. ప్రయాణికులకు గుడ్న్యూస్ చెప్పిన మెట్రో..
-
Delhi: ఢిల్లీలో దారుణం.. యూపీఎస్సీకి సిద్ధపడుతున్న యువతి హత్యాచారం
-
Peddi: చరణ్ ‘పెద్ది’లో శృతి హాసన్ ..
ట్రెండింగ్
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?
-
144Hz రిఫ్రెష్ రేట్, 13.2 అంగుళాల డిస్ప్లే, 13380mAh బ్యాటరీతో OPPO Pad 5 Pro లాంచ్.!
-
50MP+50MP+50MP కెమెరాలు, IP68/IP69 రేటింగ్, వేపర్ చాంబర్ కూలింగ్ టెక్నాలజీతో నేడు లాంచ్ కానున్న Motorola Edge 70 Pro.!