NTV Telugu Site icon

CM Chandrababu: రేపు తిరుమలకు సీఎం చంద్రబాబు

Cbn

Cbn

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు తిరుమల పర్యటనకు వెళ్లనున్నారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో.. శ్రీవారికి రాష్ర్ట ప్రభుత్వం తరపున పట్టు వస్ర్తాలు సమర్పించనున్నారు సీఎం చంద్రబాబు దంపతులు. రేపు సాయంత్రం 6:20కి తిరుమలకు చేరుకుంటారు. బేడి ఆంజనేయస్వామి ఆలయం నుంచి పట్టువస్ర్తాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకోనున్నారు చంద్రబాబు దంపతులు. తర్వాత శ్రీవారి ఆలయంలో గడపనున్నారు. అలాగే 2025 వార్షిక సంవత్సరం క్యాలెండర్లను ఆవిష్కరించనున్నారు సీఎం. ఎల్లుండి ఉదయం 7.35కి 5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన వకుళామాత వంటశాలను ప్రారంభించనున్నారు. తర్వాత తిరిగి విజయవాడకు చేరుకుంటారు.

Read Also: Phani: పాన్ ఇండియా మూవీగా రానున్న “ఫణి”.. టైటిల్ లాంఛ్!

సీఎం చంద్రబాబు తిరుమల పర్యటన వివరాలు..
* రేపు సాయంత్రం 6:20కి తిరుమల చేరుకోనున్న చంద్రబాబు
* రాత్రి 7:55కి బేడి ఆంజనేయస్వామి ఆలయం నుంచి పట్టువస్ర్తాలతో ఊరేగింపు..
* ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకోనున్న చంద్రబాబు దంపతులు
* రాత్రి 7:55 నుంచి 9:15 వరకు శ్రీవారి ఆలయంలో గడపనున్న చంద్రబాబు
* 2025 వార్షిక సంవత్సరం క్యాలెండర్లును ఆవిష్కరించనున్న చంద్రబాబు
* ఎల్లుండి ఉదయం 7.35కి వకుళామాత వంటశాలను ప్రారంభించనున్న చంద్రబాబు
* ఉదయం 7:55కి ముగియనున్న సీఎం చంద్రబాబు తిరుమల పర్యటన
* తిరుమల నుంచి రేణిగుంటకు.. అక్కడి నుంచి విజయవాడ చేరుకోన్న సీఎం