జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆర్మీ ఛీఫ్ జనరల్ బిపిన్ రావత్ పటం వద్ద నివాళులర్పించిన కేంద్ర రక్షణ శాఖ మాజీ సహాయ మంత్రి ఎం.ఎం. పల్లం రాజు మీడియాతో మాట్లాడారు. భారత దేశం చాలా క్రిటికల్ జంక్షన్లో ఉందన్నారు. ఇప్పటి వరకు మనకు ప్రత్యర్థి పాకిస్తాన్ను సరిహద్దులో ఎదుర్కొంటూ వచ్చాం. గత రెండేళ్లుగా చైనా మన సరిహద్దులో తన ఆధిపత్యం కోసం చాల దూకుడుగా వ్యవహరిస్తూ పాగా వేసిందన్నారు. సరిహద్దు సమస్య పరిష్కారం కానంత వరకు చైనా మనకు ఒక మేజర్ త్రేట్గానే ఉంటుందన్నారు.
చైనాతో మనం సరిగ్గా హ్యండిల్ చేయకపోవడం వల్ల వారొచ్చి మన సరిహద్దులో కూర్చున్నారు..ఇక అక్కడ నుండి వారు కదిలే పరిస్ధితులు కనిపించడం లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సీడీఎస్ బీపీన్ రావత్ను కోల్పోవడం దేశానికి తీరని నష్టమని ఆయన పేర్కొన్నారు. సిలిగురి జంక్షన్ను చైనా ఆక్రమించకుండా బిపిన్ రావత్ తీసుకున్న చర్యలే రావత్ అంటే ఏంటోనిరూపించాయన్నారు. ఆర్మీ,ఎయిర్ ఫోర్సు, నేవీలను ఒక సమన్వయంతో ముందుకు నడిపించారు. రక్షణ శాఖ ఆయుధాలను పెంపొందించేందుకు…వాటిని స్వదేశంలోనే తయారు చేయ్యాలని ఆకాంక్షించిన గొప్ప వ్యక్తి బిపిన్ రావత్ అని పల్లం రాజు అన్నారు.