Site icon NTV Telugu

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పై జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్…

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పై జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్ కామెంట్స్ చేసింది. సిఎస్ తో పాటు అదనంగా నాలుగు డిపార్ట్మెంట్లో కి ఇన్చార్జిగా వ్యవహరిస్తు తన విధులను సక్రమంగా నిర్వహించడం లేదు. పని తీరు కూడా ఉండాల్సిన స్థాయిలో లేదు. రాజ్యాంగ బద్ధ సంస్థల ఆదేశాలను పాటించడం లేదు కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తున్నారు. ఆయనను రాష్ట్ర పునర్విభజన లో భాగంగా ఏపీకి కేటాయిస్తే తెలంగాణలో విధులు నిర్వర్తిస్తున్నారు. వెంటనే తన దగ్గర ఉన్న శాఖలకు ఇతర ఐఏఎస్ అధికారులకు అప్పగించాలి. ఎస్సి ఎంప్లాయిస్ హక్కులను కాపాడడంలో సీఎస్ విఫలం అయ్యాడు. రామ హరి ప్రసాద్ విషయంలో లో సిసిఎల్ఎ, రెవెన్యూ అథారిటీస్ తప్పుడు సమాచారం ఇచ్చాయి. ఆయన పైన ఎలాంటి చార్జెస్ లేకున్నా ఉన్నాయని తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వెంటనే రామా హరి ప్రసాద్ ని మేడ్చల్ మల్కాజ్గిరి డిప్యూటీ కలెక్టర్ గా పోస్టింగ్ ఇవ్వాలి . పది రోజుల్లో యాక్షన్ టెకెన్ రిపోర్ట్ పంపించాలి అని తెలిపింది.

Exit mobile version