తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన విద్యావేత్త డా.కంచర్ల శ్రీకాంత్ ఉద్వేగానికి లోనయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తనకు ఎదురైన అనుభవాలను ఆయన వివరించారు. ఇంతకంటే ఇంకేం కావాలి.365 రోజులు పార్టీ కోసం.. చంద్రబాబుని సీఎం చేయడం కోసం పని చేస్తా.ఈ ఎన్నికలను ఓ కేస్ స్టడీగా తీసుకోవాలి.నిఖార్సైన కార్యకర్తకు గౌరవం దక్కుతుందని చెప్పడానికి నేనే నిదర్శనం.2013లో గెలుపునకు అవకాశం లేని కందుకూరు రూరల్ జడ్పీటీసీ నుంచి పోటీ చేసి గెలిచాను.. ఆ తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చింది.
Read Also:Chandrababu Naidu: అధికారులు ఆలోచించి పనిచేయాలి
ఇప్పుడు ఎమ్మెల్సీగా గెలుపు కష్టమని చాలా మంది నిరుత్సాహ పరిచారు.కానీ బంపర్ మెజార్టీ సాధించాను.. ఇప్పుడూ టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం.నా గెలుపును లోకేషుకు అంకితం ఇస్తున్నానురెండో ప్రాధాన్యత ఓట్లను పీడీఎఫ్ తో షేరింగ్ చేసుకునే విషయంలో వేరే అభిప్రాయంతో ఉన్నాం.కానీ చంద్రబాబు కాలిక్యులేషన్ పవి చేసింది. ముగ్గురం ఎమ్మెల్సీలుగా గెలిచాం. పార్టీ పటిష్టత కోసం అంతా కలిసి పనిచేస్తాం అన్నారు. తనకు సహకరించిన వారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
Read Also: MLC Ramagopal Reddy: గెలిచాక కూడా చాలా ఇబ్బంది పెట్టారు