Andhra Pradesh: ఏపీ వ్యాప్తంగా చిట్ఫండ్స్ కార్యాలయాల్లో అధికారుల సోదాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ఏపీ వ్యాప్తంగా చిట్ఫండ్స్ సంస్థల కార్యాలయాలపై ఏపీ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ దాడులు చేస్తోంది. విజయవాడలోని నాలుగు మార్గదర్శి చిట్ఫండ్స్ కార్యాలయాలతో పాటు రాష్ట్రంలోని పలు ఆఫీసుల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. మార్గదర్శితో పాటు శ్రీరామ్ చిట్స్, కపిల్ చిట్స్ ఫండ్స్ కార్యాలయాల్లోనూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. చిట్స్ పేరుతో సేకరిస్తున్న సొమ్మును నిబంధనలకు విరుద్ధంగా పలు చిట్ఫండ్ సంస్థలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయించుకుంటున్నారని.. ఈ సొమ్ముతో వడ్డీ వ్యాపారం చేస్తున్నారని ఆరోపణలు రావడంతో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. చిట్స్ పూర్తయిన తర్వాత పలు సంస్థలు అధిక వడ్డీ ఆశ చూపి తమ వద్దే డిపాజిట్ చేయించుకుటున్నాయన్న ఆరోపణలపై తాజా సోదాల్లో లెక్కలు బయటపడే అవకాశం ఉంది.
Read Also: YS Jagan: రేపు హైదరాబాద్కు వైఎస్ జగన్.. సూపర్స్టార్ కుటుంబాన్ని పరామర్శించనున్న సీఎం..
Also Read
- CM Chandrababu: వికసితం నుంచి వైభవం వైపు.. ఆంధ్రప్రదేశ్పై చంద్రబాబు భారీ లక్ష్యం
- Nara Lokesh: యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లొద్దు.. మన అమరావతి, విశాఖ, కర్నూలులోనే ఉద్యోగాలు..
- Deputy CM Pawan Kalyan: కాకినాడలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. అభివృద్ధి, స్వేచ్ఛపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- ‘తప్పుడు కేసులతో వేధిస్తున్నారు’.. కూటమి ప్రభుత్వంపై సీదిరి అప్పలరాజు సంచలన వ్యాఖ్యలు
అటు ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావుకు చెందిన మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ చేపట్టిన డిపాజిట్ల అంశంపై ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలను ఉల్లంఘించి డిపాజిట్లు సేకరించారన్న ఆరోపణలతో గతంలో కాంగ్రెస్ పార్టీ నేత ఉండవల్లి అరుణ్కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే 2018, డిసెంబర్ 31న తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. దీంతో హైకోర్టు తీర్పును ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ కేసులో తాము కూడా ఇంప్లీడ్ అవుతామని పిటిషన్ దాఖలు చేసింది.
తాజావార్తలు
-
India’s 80-Year Sports Journey: హాకీ స్వర్ణయుగం నుంచి క్రికెట్ సామ్రాజ్యం వరకు.. 80 ఏళ్ల భారత క్రీడా ప్రస్థానం..
-
Bhargav BV: కన్నడ సుప్రీమ్ స్టార్ కొత్త ప్రయాణం… క్లాసిక్ టైటిల్తో హీరోగా, దర్శకుడిగా తెలుగు సినిమా
-
CM Revanth Reddy: నియామకాలను బాధ్యతగా తీసుకున్నాం.. 72 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం..
-
LPG e-KYC deadline 2026: ఆగస్టు 16 తర్వాత LPG సిలిండర్ రాదా?.. e-KYC తప్పనిసరి.. పూర్తి వివరాలు
-
CM Revanth Reddy: రాష్ట్రంలో 105 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు మంజూరు చేశాం..
ట్రెండింగ్
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!