ఏపీకి భారంగా మారిన కోవిడ్ ఖర్చులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్థిక ఇబ్బందుల్లో వున్న ఏపీకి కరోనా అదనపు భారంగా మారుతోందన్నారు ఆర్ధిక శాఖ స్పెషల్ సీఎస్ ఎస్ఎస్ రావత్. కరోనా సమయంలో చాలా రాష్ట్రాలు సంక్షేమానికి కోత వేశాయి. కానీ ఏపీలో సంక్షేమం ద్వారా పేదలకు నగదు పంపిణీ చేశాం. సీఎం జగన్ అధికారంలోకి రాగానే 27 శాతం ఐఆర్ ప్రకటించారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో ఐఆర్ ఇవ్వలేదు.. ఇదో చరిత్ర అన్నారు.
కానీ ఇప్పుడు కోవిడ్ కారణంగా ఆదాయాలు పడిపోయాయి. రాజధానిని కోల్పోవడం వల్ల 2015-2020 వరకు రూ. 1.80 లక్షల కోట్లు నష్టం వచ్చిందని రావత్. తెలంగాణ జెన్కో నుంచి రూ. 6284 కోట్లు బకాయిలు రావాల్సి ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల మధ్య అన్ డివైడ్ లోన్ రూ. 33478 కోట్లు ఉన్నాయి.కరోనా వల్ల రూ. 21,933 కోట్లు రెవెన్యూ నష్టం సంభవించిందన్నారు. కోవిడ్ కారణంగా అదనపు ఖర్చు రూ. 30 వేల కోట్లకు చేరిందన్నారు. పీఆర్సీ ప్రకటించిన తర్వాత ఐఆర్ మొత్తం నుంచి అడ్జస్ట్ చేస్తామని ఐఆర్ ప్రకటిస్తూ ఇచ్చిన జీవోలోనే స్పష్టంగా చెప్పామని రావత్ వివరించారు.
Also Read
- AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
- OTR: ఆదోని, ఎమ్మిగనూరు కూటమిలో కుమ్ములాటలు స్థానిక ఎన్నికలపై ప్రభావం ..?
- AP Municipal Elections: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. కీలక ఉత్తర్వులు
అధ్యయనం తర్వాతే నిర్ణయం: శశిభూషణ్, జీఏడీ ముఖ్య కార్యదర్శి
పూర్తి స్థాయిలో అధ్యయనం తర్వాతే అధికారుల కమిటీ 14.29 శాతం రికమెండ్ చేసింది. ప్రభుత్వం మాత్రం 23 శాతం ఫిట్మెంట్ ప్రకటించింది. సీపీసీ ప్రకారం హెచ్చార్ఏ స్లాబులు ఇవ్వాలని నిర్ణయించాం.సీసీఏ కూడా రద్దు చేశాం.పీఆర్సీ అంటే ఫిట్మెంట్, హెచ్చార్ఏనే కాదు.. చాలా కాంపోనెంట్లు ఉంటాయి.కొన్ని కాంపోనెంట్లల్లో తగ్గాయి.. కొన్నింటిలో పెరిగాయి.
హెచ్చార్ఏను కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ప్రకారం ఫాలో అవుతున్నాయి.యూపీ, గుజరాత్, రాజస్థాన్, ఒడిషా, మధ్య ప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రాలు సీపీసీనే ఫాలో అవుతున్నాయి.ఐఏఎస్ అధికారులకున్న రూ. 40 వేల స్లాబును తొలగించాం.పీఆర్సీ ఇంపాక్ట్ ఏపీ ప్రభుత్వంపై రూ. 10,247 కోట్ల భారం పడుతుంది.గ్రాస్ పే ఎక్కడా తగ్గదు..?అన్నారు శశిభూషణ్.
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!