అక్టోబర్ 7 నుండి 15 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్రహ్మోత్సవాల కోసం పుష్కరిణి మరమ్మతు పనులును చేపట్టింది టీటీడీ. శ్రీవారి ఆలయంలో పుష్కరిణి హరతిని నెల రోజులు పాటు రద్దు చేసింది. ఇప్పటికే పనులు ప్రారంభించింది. అన్ని అనుకున్నట్టుగా జరిగితే తిరిగి సెప్టెంబర్ 13నుంచే పుష్కరిణిని భక్తులకు అందుబాటులోకి తెస్తారు.. శ్రీవారి ఆలయానికి ఈశాన్యం మూలలో స్వామివారి పుష్కరిణి నెలకొని వుంటుంది. ముల్లోకాలలో వున్న అన్ని తీర్దాలు స్వామి పుష్కరిణిలో కలుస్తాయని ఆలయ పండితులు పేర్కొంటారు. దీంతో శ్రీవారి పుష్కరిణిని దర్శించుకున్నా.. అందులో స్నానం చేసిన సమస్త పాపాలు హరించుకుపోతాయని భక్తులు విశ్వాసం. అసలు తిరుమల చేరుకున్న భక్తులు క్షేత్ర సంప్రదాయం ప్రకారం ముందుగా శ్రీవారి పుష్కరిణిలో స్నానమాచరించి.. వరాహస్వామిని దర్శించుకొని… ఆ తర్వాత శ్రీవారిని దర్శించుకుంటే.. అంతా మంచి జరుగుతుంది అంటారు పండితులు.
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
- Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
- AP Govt: రైతులకు, భూ యజమానులకు బిగ్ రిలీఫ్.. మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం..
ఇక స్వామివారి పుష్కరిణిలో ప్రతి ఏటా పాల్గుణ మాసం పౌర్ణమికి ముగిసేలా ఐదు రోజులు పాటు తెపోత్సవాలు నిర్వహిస్తారు. వైకుంఠ ద్వాదసి, రథ సప్తమి రోజున బ్రహ్మోత్సవాలలో చివరి రోజు పుష్కరిణిలో చక్రస్నానం కార్యక్రమం జరుపుతారు. అంతటి పరమ పవిత్రమైన శ్రీవారి పుష్కరిణిలో నిత్యం వేల సంఖ్యలో భక్తులు స్నానాది కార్యక్రమాలు ఆచరిస్తారు. నిత్యం స్వామివారి సహస్రదీపాలంకరణ సేవ ముగిసిన తర్వాత శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి వారు నాలుగు మాఢ వీధులలో విహరిస్తూ భక్తులుకు దర్శనమిస్తారు.
అదే సమయంలో ఉరేగింపులో భాగంగా స్వామివారు తూర్పు మాడ వీధిలో వున్న పుష్కరిణికి చేరుకున్న సమయంలో అర్చకులు పుష్కరిణి హరతిని ఇస్తారు. ఇలా నిత్యం ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగే స్వామివారి పుష్కరిణి హరతికి ప్రతి ఏటా నెల రోజులు పాటు మాత్రం బ్రేకు పడుతుంది. బ్రహ్మోత్సవాలు ముందు శ్రీవారి పుష్కరిణి మరమ్మతు పనులు నిర్వహించడం పరిపాటిగా మారిపోయింది. ఈ ఏడాది శ్రీవారి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 7 నుండి 15 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపింది టీటీడీ. దీనికి ముందు నెల రోజులు పాటు పుష్కరిణి మరమత్తుల పనులుకు శ్రీకారం చుట్టింది. అన్ని అనుకున్నట్టుగా సాగితే తిరిగి సెప్టెంబర్ 13నుంచే పుష్కరణి హారతిని పునరుద్దరించనుంది టీటీడీ.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!