అక్టోబర్ 7 నుండి 15 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్రహ్మోత్సవాల కోసం పుష్కరిణి మరమ్మతు పనులును చేపట్టింది టీటీడీ. శ్రీవారి ఆలయంలో పుష్కరిణి హరతిని నెల రోజులు పాటు రద్దు చేసింది. ఇప్పటికే పనులు ప్రారంభించింది. అన్ని అనుకున్నట్టుగా జరిగితే తిరిగి సెప్టెంబర్ 13నుంచే పుష్కరిణిని భక్తులకు అందుబాటులోకి తెస్తారు.. శ్రీవారి ఆలయానికి ఈశాన్యం మూలలో స్వామివారి పుష్కరిణి నెలకొని వుంటుంది. ముల్లోకాలలో వున్న అన్ని తీర్దాలు స్వామి పుష్కరిణిలో కలుస్తాయని ఆలయ పండితులు పేర్కొంటారు. దీంతో శ్రీవారి పుష్కరిణిని దర్శించుకున్నా.. అందులో స్నానం చేసిన సమస్త పాపాలు హరించుకుపోతాయని భక్తులు విశ్వాసం. అసలు తిరుమల చేరుకున్న భక్తులు క్షేత్ర సంప్రదాయం ప్రకారం ముందుగా శ్రీవారి పుష్కరిణిలో స్నానమాచరించి.. వరాహస్వామిని దర్శించుకొని… ఆ తర్వాత శ్రీవారిని దర్శించుకుంటే.. అంతా మంచి జరుగుతుంది అంటారు పండితులు.
Also Read
- Sai Krishna Death Case: సాయికృష్ణ డెత్ కేసులో కీలక మలుపు.. లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని.!
- CM Chandrababu: పెట్టుబడుల కంటే ఆలోచనలే ముఖ్యం.. సీఐఐ సమ్మిట్పై సీఎం కీలక వ్యాఖ్యలు.!
- CM Chandrababu: రాజధాని నిర్మాణాల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తం.!
- Nagababu: జనసేన పార్టీ ఆ పార్లమెంట్ పరిధిలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది.. ఎమ్మెల్సీ నాగబాబు కీలక వ్యాఖ్యలు.!
ఇక స్వామివారి పుష్కరిణిలో ప్రతి ఏటా పాల్గుణ మాసం పౌర్ణమికి ముగిసేలా ఐదు రోజులు పాటు తెపోత్సవాలు నిర్వహిస్తారు. వైకుంఠ ద్వాదసి, రథ సప్తమి రోజున బ్రహ్మోత్సవాలలో చివరి రోజు పుష్కరిణిలో చక్రస్నానం కార్యక్రమం జరుపుతారు. అంతటి పరమ పవిత్రమైన శ్రీవారి పుష్కరిణిలో నిత్యం వేల సంఖ్యలో భక్తులు స్నానాది కార్యక్రమాలు ఆచరిస్తారు. నిత్యం స్వామివారి సహస్రదీపాలంకరణ సేవ ముగిసిన తర్వాత శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి వారు నాలుగు మాఢ వీధులలో విహరిస్తూ భక్తులుకు దర్శనమిస్తారు.
అదే సమయంలో ఉరేగింపులో భాగంగా స్వామివారు తూర్పు మాడ వీధిలో వున్న పుష్కరిణికి చేరుకున్న సమయంలో అర్చకులు పుష్కరిణి హరతిని ఇస్తారు. ఇలా నిత్యం ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగే స్వామివారి పుష్కరిణి హరతికి ప్రతి ఏటా నెల రోజులు పాటు మాత్రం బ్రేకు పడుతుంది. బ్రహ్మోత్సవాలు ముందు శ్రీవారి పుష్కరిణి మరమ్మతు పనులు నిర్వహించడం పరిపాటిగా మారిపోయింది. ఈ ఏడాది శ్రీవారి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 7 నుండి 15 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపింది టీటీడీ. దీనికి ముందు నెల రోజులు పాటు పుష్కరిణి మరమత్తుల పనులుకు శ్రీకారం చుట్టింది. అన్ని అనుకున్నట్టుగా సాగితే తిరిగి సెప్టెంబర్ 13నుంచే పుష్కరణి హారతిని పునరుద్దరించనుంది టీటీడీ.
తాజావార్తలు
-
Ketan Agarwal Case: చదువులో జీరో.. ఇంటర్ ఫెయిల్ తర్వాత సియా ఏం చేసిందంటే..!
-
Ponguleti Srinivas Reddy : హరీష్రావుకు మెంటల్ బ్యాలెన్స్ తప్పింది.. అసెంబ్లీ రద్దు ఎందుకు.?
-
Idupu Kayitham: అసలెందుకీ వివాదం.. ఎక్కడ మొదలైందంటే?
-
Ullipaya Chutney: రుచితో పాటు ఆరోగ్యం.. సాంప్రదాయ ‘చింతపండు ఉల్లిపాయ చట్నీ’ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి!
-
Germany: జర్మనీలో దుండగుడు కాల్పులు.. ఐదుగురు మృతి
ట్రెండింగ్
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!