Love Attack: కడప జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మైదుకూరు సమీపంలోని ఖాజీపేట అగ్రహారంలో కీర్తన అనే విద్యార్థిని హత్యకు గురైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రేమోన్మాది దాడిగా భావిస్తున్న ఈ ఘటన ప్రజలను షాక్కు గురిచేసింది. పోలీసులు చెబుతున్న సమాచారం ప్రకారం, కీర్తనపై ఒక వ్యక్తి కత్తితో దాడి చేసి గొంతు కోసినట్లు అనుమానిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం కడపకు తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే ఆమె మృతి చెందినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనకు సంబంధించి ఆంజనేయకొట్టాలు గ్రామానికి చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటన అనంతరం అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రేమ వ్యవహారం నేపథ్యంలో ఈ దారుణం జరిగినట్టు స్థానికులు భావిస్తున్నారు. అయితే, అసలు కారణాలు ఏమిటన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా.. శిక్షలు పడుతున్నా.. ఇలాంటి ఘటనలు ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి..
