Love Attack: కడప జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మైదుకూరు సమీపంలోని ఖాజీపేట అగ్రహారంలో కీర్తన అనే విద్యార్థిని హత్యకు గురైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రేమోన్మాది దాడిగా భావిస్తున్న ఈ ఘటన ప్రజలను షాక్కు గురిచేసింది. పోలీసులు చెబుతున్న సమాచారం ప్రకారం, కీర్తనపై ఒక వ్యక్తి కత్తితో దాడి చేసి గొంతు కోసినట్లు అనుమానిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం కడపకు తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే ఆమె మృతి చెందినట్లు తెలుస్తోంది.…