Anil Kumar Yadav: నెల్లూరు సిటీ నియోజకవర్గ కార్యకర్తలతో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా కార్యకర్తల జోలికొస్తే మూడింతలుగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అని వార్నింగ్ ఇచ్చారు. మూడేళ్లకు పైగా మంత్రిగా పనిచేశా.. నారాయణ విద్యాసంస్థల జోలికి వెళ్లలేదు.. ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు చేపట్టలేదు.. తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ మూడు నెలల్లోనే అనేక మంది వైసీపీ నేతలు కార్యకర్తలను బెదిరిస్తున్నారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మేము అనుకుని ఉంటే నారాయణ విద్యాసంస్థలు ఉండేవా అని ప్రశ్నించారు. దసరా నుంచి నెల్లూరులోనే అందుబాటులో ఉంటా.. కార్యకర్తలను రక్షించుకుంటాం.. అండగా ఉంటామని అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు.
Read Also: Hydraa Update: కూకట్ పల్లి, అమీన్ పూర్.. హైడ్రా అప్డేట్ ..
ఇక, తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి కలిసిందని అసత్య ఆరోపణలు చేస్తున్న టీడీపీ ప్రభుత్వం.. వెంటనే విచారణ చేయాలని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. ఇలాంటి తప్పుడు ప్రచారంతో శ్రీవారి భక్తుల మనోభవాలను దెబ్బ తీయొద్దని కోరారు. చంద్రబాబు సర్కార్ చేస్తున్న దారుణమైన పనులను కలియుగ వైకుంఠ క్షేత్రంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి చూస్తున్నాడని చెప్పారు.