Simhachalam: రేపే సింహాచల చందనోత్సవం.. అప్పన్న నిజరూప దర్శనం.!
- నిజరూప దర్శనం ప్రత్యేకత
- భక్తుల భారీ రద్దీ
- ఎండల మధ్య సౌకర్యాలు
- ఏఐతో భద్రత ఏర్పాట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరాంధ్ర ఇలవేల్పు సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి అత్యంత వేడుకైన ‘చందనోత్సవం’ కోసం క్షేత్రం సర్వం సిద్ధమైంది. ఏటా వైశాఖ శుద్ధ తదియ (అక్షయ తృతీయ) పర్వదినాన మాత్రమే స్వామి వారు చందన పూత లేకుండా తన నిజరూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ అపురూప ఘట్టాన్ని వీక్షించేందుకు రెండు లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్న అధికారులు, అందుకు తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ పవిత్ర కార్యక్రమంలో భాగంగా తొలుత ఆలయ వంశపారంపర్య ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతి రాజు స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి అనిత పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం, రేపు తెల్లవారుజామున 3:30 గంటల నుండి సామాన్య భక్తులకు నిజరూప దర్శనం ప్రారంభమవుతుంది. సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఈ దర్శన భాగ్యం కలుగుతుందని, ఆ తర్వాత తిరిగి స్వామి వారికి 125 కిలోల కొత్త చందనంతో పూత వేస్తామని ఆలయ కమిటీ తెలిపింది.
Also Read
- TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
- YS Jagan: డీఎస్సీ అక్రమాలపై సీఎం చంద్రబాబుకు జగన్ ప్రశ్నలు.. 1-6 ట్విస్ట్లతో ఎక్స్లో పోస్టులు!
- Ganesh Idol Protest: 'వినాయకుడి'తో వినూత్న నిరసన.. దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా..?
- Vijayawada: అప్పులు.. ఈఎంఐలు.. ఆర్భాటపు జీవితం.. దొంగగా మారిన 22 ఏళ్ల బీటెక్ యువకుడు..
ఎండల తీవ్రత దృష్ట్యా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) , దేవస్థానం అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. సుమారు 200 పాయింట్లలో 20 లక్షల వాటర్ బాటిళ్లను అందుబాటులో ఉంచడంతో పాటు, మజ్జిగ, బిస్కెట్లు , చిన్న పిల్లలకు పాలు పంపిణీ చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భద్రతా పరంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 2,800 మంది పోలీసులతో పహారా ఏర్పాటు చేయడమే కాకుండా, ఈసారి రద్దీని పర్యవేక్షించేందుకు తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను వాడుతున్నారు. వి.ఐ.పి దర్శనాల కోసం రూ.1500, రూ.1000, రూ.300 టికెట్లతో ప్రత్యేక క్యూ లైన్లు సిద్ధం చేశారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడానికి , ఎండ నుండి రక్షణ కల్పించడానికి పటిష్టమైన షెడ్లు, బారికేడ్లు నిర్మించారు. ముగ్గురు మంత్రుల కమిటీ , జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఈ మహా ఉత్సవాన్ని దిగ్విజయంగా నిర్వహించేందుకు యంత్రాంగం నిరంతరం శ్రమిస్తోంది.
Big Basket : బిగ్ బాస్కెట్ కస్టమర్లకు షాక్.. కుళ్ళిన మాంసం, ఎక్స్పైరీ డేట్ వస్తువుల సరఫరా..!
తాజావార్తలు
-
West Bengal: 200కు పైగా మదర్సాలు క్లోజ్.. సువేందు సర్కార్ సంచలన చర్యలు..
-
Bestselling 125cc Motorcycle: లక్షల్లో అమ్ముడవుతున్న బైక్… మైలేజ్ లెక్కల్లో ఊహించని ట్విస్ట్..
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
-
UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
ట్రెండింగ్
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?