కరోనా లాక్డౌన్ కారణంగా 2020లో ఏపీలో రోడ్డుప్రమాదాలు తగ్గాయి. అయితే 2021లో మళ్లీ రోడ్డుప్రమాదాల్లో చనిపోయిన వారి మృతుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ మేరకు ఏపీ రహదారి భద్రత కౌన్సిల్ నివేదిక సిద్ధం చేసింది. ఈ నివేదిక ప్రకారం… గత ఏడాది ఏపీలో మొత్తం 19,729 రోడ్డుప్రమాదాలు జరగ్గా.. వాటిలో 8,053 మంది చనిపోయారు. మరో 21,169 మంది గాయపడ్డారు. 2020తో పోలిస్తే 2021లో రోడ్డుప్రమాదాల్లో 10.16 శాతం, మరణాల్లో 14.08 శాతం, క్షతగాత్రుల్లో 7.94 శాతం పెరుగుదల కనిపించింది.
2021లో జిల్లాల వారీగా నమోదైన రోడ్డుప్రమాదాలు: శ్రీకాకుళం-856 (290 మంది మృతులు), విజయనగరం-863 (292 మంది మృతులు), విశాఖ-2,344 (755 మంది మృతులు) తూర్పుగోదావరి-2,192 (774 మంది మృతులు), పశ్చిమగోదావరి-1,325 (554 మంది మృతులు), కృష్ణా-2,048 (667 మంది మృతులు), గుంటూరు-2,084 (953 మంది మృతులు), ప్రకాశం-1,500 (647 మంది మృతులు), నెల్లూరు-1,187 (570 మంది మృతులు), చిత్తూరు-1,654 (716 మంది మృతులు), కడప-1,243 (524 మంది మృతులు), అనంతపురం-1,143 (638 మంది మృతులు), కర్నూలు-1,290 (673 మంది మృతులు)
