YS Jagan: రాయలసీమ లిఫ్ట్ను ఆపించామని తెలంగాణ సీఎం అసెంబ్లీలో చెప్పారు.. చంద్రబాబు మాపై ఆరోపణలా..?
- రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై వాస్తవాలు అందరికీ తెలియాలి..
- రాయలసీమ లిఫ్ట్ ను ఆపించామని తెలంగాణ సీఎం అసెంబ్లీలో ప్రకటించారు..
- రాష్ట్రాన్ని చంద్రబాబు ఎలా అమ్మకానికి పెట్టారో రేవంత్ రెడ్డి చెప్పారు..
- స్వార్థ రాజకీయల కోసం రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టారు: వైఎస్ జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వివాదంపై తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు మాటలు, ఆయన ఇరిగేషన్ మంత్రి మాట్లాడిన మాటలు చూస్తుంటే వీళ్ళు మనుషులేనా అనిపిస్తుంది.. వీళ్లను చూస్తే రాక్షసులను తలపించేలా ఉన్నారని మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీలో ఏకంగా అక్కడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన మాటలు రైతన్నలకు విలన్ లాగా కనిపిస్తున్నారు.. క్లోజ్డ్ మీటింగ్ లో నేను ఒత్తిడి తెచ్చి పనులు ఆపించాను అనే దానికి రేవంత్ రెడ్డి మాటలు సాక్ష్యాలు అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు ఖండిస్తారని అందరూ భావించారు.. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అవసరం లేదని వీళ్లు బరితెగించి మాట్లాడిన మాటలు వారి ఇద్దరి మధ్య జరిగిన ఒప్పందానికి ఆమోద ముద్ర వేసినట్లేనని మాజీ సీఎం జగన్ పేర్కొన్నారు.
Read Also: TOXIC : యష్ బర్త్ డే స్పెషల్.. టాక్సిక్ ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్.. కొంచం యాక్షన్.. మరికొంత ఓవరాక్షన్
Also Read
- AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ నివేదికకు ఆమోదం?
- AP Assembly: నేడు రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు.. క్వశ్చన్ అవర్తో ప్రారంభం కానున్న శాసనసభ!
- Bandi Sanjay: బీఆర్ఎస్తో బీజేపీ ఎప్పుడూ పొత్తు పెట్టుకోలేదు..!
- OTR: ఏలూరు కూటమిలో రగులుతున్న కుమ్ములాటలు! నేతల మధ్య కోల్డ్ వార్!
ఇక, తన స్వార్ధం కోసం పిల్లను ఇచ్చిన మామని, జన్మనిచ్చిన సీమకు కూడా సీఎం చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఒక గొప్ప ఉద్దేశ్యంతో ప్రారంభించాం.. తాగటానికి మంచి నీళ్లు కూడా దొరకని ప్రాంతానికి రాయలసీమ లిఫ్ట్ ఒక ఇన్సూరెన్స్ పాలసీ లాంటిది.. రాయలసీమ, నెల్లూరు, చెన్నై ప్రాంతాలకు కూడా సంజీవని లాంటిది అని తెలిపారు. అందరికీ, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై వాస్తవాలు తెలియాలి అన్నారు. రాష్ట్రాన్ని చంద్రబాబు ఎలా అమ్మకానికి పెట్టారో రేవంత్ రెడ్డి చెప్పారు.. స్వార్థ రాజకీయల కోసం చంద్రబాబు రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టారని విమర్శించారు. ఇలాంటి చరిత్ర హీనులు దేశంలో ఎవరూ ఉండరు అని వైఎస్ జగన్ మండిపడ్డారు.
- Tags
తాజావార్తలు
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Dhruv Vikram : అనుపమతో బ్రేకప్.. కామెంట్స్ పై ధృవ్ విక్రమ్ స్ట్రాంగ్ కౌంటర్
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!
-
Rhea Chakraborty: సుశాంత్ మరణం నా జీవితాన్నే మార్చేసింది.. నాన్నకు ఉద్యోగం కూడా పోయింది: రియా చక్రవర్తి
-
Virat Kohli: 18 ఏళ్ల క్రికెట్ ప్రయాణం.. విరాట్ కోహ్లీని ‘కింగ్’గా మార్చిన రికార్డ్ ఇదిగో.!
ట్రెండింగ్
-
Beetroot Halwa: బీట్రూట్ తినడం ఇష్టం లేదా.. అయితే “బీట్రూట్ హల్వా” ఇలా చేసేయండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు.!
-
Sanjay Manjrekar: లైవ్లో మాజీ క్రికెటర్ల మధ్య వార్.. అద్దంలో చూసుకో అంటూ ఒకరిపై మరొకరు సెటైర్లు!
-
Jeep Compass 85th Anniversary Edition లాంచ్.. ధర రూ.26.70 లక్షలు, కేవలం 85 యూనిట్లే!
-
Flower Plants: వర్షాలు పడుతున్నాయా.? అయితే ఆలస్యం ఎందుకు.. ఎక్కువ కష్టపడకుండానే ఇంట్లోనే పూల తోట పెంచేయండి ఇలా..!
-
రూ.8,499కే ఇంట్లోనే థియేటర్.! 200 అంగుళాల స్క్రీన్, స్మార్ట్ ఫీచర్లతో XElectron Techno Plus ప్రొజెక్టర్ లాంచ్.!