Draupadi Murmu: దేశాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
President Draupadi Murmu Speech In AP Tour: ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. దేశాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుందని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తున్న ముఖ్యమంత్రి జగన్కు అభినందనలు తెలిపారు. తొలుత ‘అందరికీ నమస్కారం, మీ అభిమానానికి ధన్యవాదాలు’ అని తెలుగులో తన ప్రసంగాన్ని మొదలుపెట్టిన ముర్మ.. తిరుమల, తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉండే ఈ నేలపై అడుగుపెట్టడం ఆనందంగా ఉందన్నారు. కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి వంటి నదులు ఈ రాష్ట్ర నేలను సారవంతం చేశాయన్నారు. నాగార్జున సాగర్, నాగార్జున కొండ, అమరావతి.. భారతదేశ చారిత్రక వారసత్వ సంపద అని తెలిపారు. కూచిపూడి నృత్యం భారత సాంస్కృతిక వైశిష్ట్యమని పేర్కొన్నారు.
దేశ భాషలందు తెలుగు లెస్సా అని వేదికపై ముర్ము అనగానే.. ఆ సభ ఒక్కసారిగా కరతాళ ధ్వనులతో హోరెత్తింది. దేశంలోని అన్ని భాషల్లో తెలుగు శ్రేష్టమైందని కొనియాడారు. నన్నయ్య, మల్లన్న, తిక్కన నడయాడిన నేల ఇది అని.. మొల్ల రాసిన మొల్ల రామాయణానికి చరిత్రలో విశిష్ట ప్రాధాన్యత ఉందని అన్నారు. గురజాడ అప్పారావు రాసిన కన్యాశుల్కం నాటకం ఇప్పటికీ ఎంతో ఆదరణీయమైందన్నారు. ఈ నేలపై పుట్టిన దుర్గాబాయి దేశ్ముఖ్, సరోజినీ నాయుడు లాంటి మహిళలు స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఇక్కడే పుట్టి దేశానికి సేవ చేసిన డా రాధాకృష్ణ, నీలం సంజీవరెడ్డి, వీవీ గిరిలను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవటం స్ఫూర్తిదాయకమన్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలను దేశం జరుపుకుంటోందని తెలియజేశారు. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన బిర్సా ముండా వంటి వారిని ఈ తరం గుర్తుంచుకోవాలని సూచించారు.
Also Read
- YS Jagan: వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు.. రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపు
- TDP Mahanadu: పసుపు జెండా చూస్తే వచ్చే వైబ్రేషన్సే వేరు.. మహానాడులో చంద్రబాబు భావోద్వేగ ప్రసంగం
- YS Jagan: సుగాలి ప్రీతి కేసుపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు..
- Mega DSC 2025: మెగా డీఎస్సీ-2025పై దుష్ప్రచారం చేస్తే క్రిమినల్ కేసులు.. పాఠశాల విద్యాశాఖ తీవ్ర హెచ్చరిక
ఆజాదీ కా అమృత్ మహోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరింత గర్వపడుతున్నారేమోనని ముర్ము చెప్పారు. జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకన్న ఈ రాష్ట్రవాసేనని తెలిపారు. అంతరిక్షం విఙ్ఞానంలో ఇస్రోలో తెలుగువారి సేవలు దేశానికి గర్వకారణమన్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని తాను కోరుకుంటున్నానని, భగవంతుడు తన ప్రార్థన తప్పక నెరవేరుస్తాడని అన్నారు. జై హింద్, జై భారత్, జై ఆంధ్రప్రదేశ్ అంటూ ద్రౌపది ముర్మ తన ప్రసంగాన్ని ముగించారు. కాగా.. ఏపీ పర్యటనకు వచ్చిన ముర్మును రాష్ట్ర ప్రభుత్వం పౌర సన్మానం చేసింది.
తాజావార్తలు
-
SRH vs RR Eliminator: కళ్లు చెదిరే గణాంకాలు వర్మ.. ఎలిమినేటర్లో బౌలర్లకు అతి పెద్ద సవాల్ ఆ ఇద్దరే!
-
YS Jagan: వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు.. రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపు
-
Vishwambhara : అదిగో విశ్వంభర.. ఇదిగో రిలీజ్
-
TDP Mahanadu: పసుపు జెండా చూస్తే వచ్చే వైబ్రేషన్సే వేరు.. మహానాడులో చంద్రబాబు భావోద్వేగ ప్రసంగం
-
August Box Office: టాలీవుడ్లో హీట్ పెంచనున్న ఆగస్టు రిలీజ్లు.. నాని Vs రవితేజ Vs శర్వా!
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!
-
Raw Mango Roti Pachadi: అమ్మ చేతి రుచిని గుర్తు చేసే పుల్లటి “మామిడికాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!