NTV Telugu Site icon

Prakasam: కొడుకుని ముక్కలు ముక్కలుగా నరికి చంపిన కన్నతల్లి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

Prakasam

Prakasam

Prakasam: ప్రకాశం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కంభం తెలుగు వీధిలో కన్న కొడుకు కదం శ్యామ్ (35)ను ముక్కలు ముక్కలుగా నరికి హత్య చేయించింది తల్లి సాలమ్మ. ఆ తర్వాత మేదర బజారు సమీపంలోని పంట కాలువ ప్రాంతంలో శరీర భాగాలను 3 గోనె సంచులలో కట్టి పడ వేశారు నిందితులు. ఇక, తన తల్లి సాలమ్మ, ఆటో డ్రైవర్ మోహన్ తో కలిసి తన తమ్ముడిని దారుణంగా హత్య చేయించారని పోలీసులకు చెప్పుకొచ్చాడు శ్యామ్ అన్న సుబ్రహ్మణ్యం..

Read Also: Rashmika: కథ బాగుంటే.. ఆ పాత్ర చేయడానికి కూడా రెడీ..

అయితే, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. ఆస్తి తగాదాలతోనే కదం శ్యామ్ ను హత్య చేశారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శరీర భాగాలను పడ వేసిన ప్రాంతంలో వాటిని గుర్తించి విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే, తల్లి సాలమ్మ, ఆటో డ్రైవర్ మోహన్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు.