Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Cm Chandrababu Naidu Virtually Inaugurates 50 Msme Parks Across Andhra Pradesh From Kanigiri

CM Chandrababu: ఒకప్పుడు ఏపీ అంటే ఛీ ఛీ అనేవాళ్లు.. ఇప్పుడు భలే భలే అంటున్నారు..

Published Date :November 11, 2025 , 2:35 pm
By Sudhakar Ravula
  • ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌ అంటే ఛీ ఛీ అనేవాళ్లు..
  • ఇప్పుడు ఏపీ అంటే భలే భలే అంటున్నారు..
  • కనిగిరి కనకపట్నం అవుతుందని బ్రహ్మంగారు చెప్పారు..
  • కనిగిరి కనకపట్నం కావడానికి ఎంతో కాలం పట్టదు..
  • ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
CM Chandrababu: ఒకప్పుడు ఏపీ అంటే ఛీ ఛీ అనేవాళ్లు.. ఇప్పుడు భలే భలే అంటున్నారు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

CM Chandrababu: ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌ అంటే ఛీ ఛీ అనేవాళ్లు.. ఇప్పుడు భలే భలే అంటున్నారు అని తెలిపారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని పీసీ పల్లి మండలం లింగన్నపాలెంలో ఎంఎస్ఎంఈ పార్కును ప్రారంభించారు.. ఇదే సమయంలో.. రాష్ట్ర వ్యాప్తంగా 17 జిల్లాలలోని 50 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్ గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కనిగిరి కనకపట్నం అవుతుందని బ్రహ్మంగారు చెప్పారు. కనిగిరి కనకపట్నం కావడానికి ఎంతో కాలం పట్టదు అన్నారు.. తుఫానులో సమర్థవంతంగా పనిచేశాం. అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి పని చేశారు. ప్రాణ, ఆస్తి నష్టం తగ్గించాం అని పేర్కొన్నారు.. చదువుకుంటున్న విద్యార్థులకు చదువులు పూర్తయ్యలోపు స్థానికంగా ఉపాధి కల్పించే బాధ్యత నాది అని తెలిపారు.. అందరూ ఉద్యోగాలు ఇస్తామని చెప్తారు.. కానీ, ఇంటికొక వ్యాపారవేత్తని చేస్తామని హామీ ఇచ్చాను. నేను చేసిన పనులే సాక్షాలు అన్నారు.. 25 ఏళ్ల క్రితం అభివృద్ధి ప్రారంభిస్తే హైదరాబాద్ దేశానికి ఆదర్శంగా నిలిచిందని గుర్తు చేశారు..

Read Also: CM Revanth Reddy: అందెశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలని ప్రధానిని కలిసి విజ్ఞప్తి చేస్తా..

గత పాలకులు చేసిన పనులు బుద్ధి ఉన్న వాళ్ళు ఎవరూ చేయరు అని ఫైర్‌ అయ్యారు సీఎం చంద్రబాబు.. ప్రజా వేదిక కూల్చడంతో ప్రారంభమైన విధ్వంసం రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. అన్ని తెలిసిన డాక్టర్ ని అయిన నాకే నాడి అంతుబట్టడం లేదు.. ఒకప్పుడు ఏపీ అంటే ఛీ ఛీ అనేవాళ్లు.. ఇప్పుడు ఏపీ అంటే భలేభలే అంటున్నారు. గూగుల్ లాంటి సంస్థలు ఏపీకి వస్తున్నాయి. లక్షా నలభై వేల కోట్లు గూగుల్ ద్వారా పెట్టుబడులు వస్తున్నాయి. ప్రధాని మోడీ, పవన్ కళ్యాణ్, నేను కలిసి కూటమి పెట్టాం. కేంద్రం తీసుకొచ్చే పాలసీలను రాష్ట్రానికి తీసుకువస్తున్నా.. పవన్ కల్యాణ్‌ కూడా బాగా మద్దతు ఇస్తున్నారు. బాగా చదువుకున్న లోకేష్ కూడా పట్టువదలని విక్రమార్కుడిగా పని చేస్తున్నాడని పేర్కొన్నారు.. చదువుకున్న పిల్లలు గతంలో అమెరికాకి వెళ్లేవాళ్లు.. ఇప్పుడు ఇక్కడే వ్యాపారాలు చేయాలని ఆలోచన చేస్తున్నారు. భవిష్యత్తు టెక్నాలజీ ది.. 35 ఏళ్ల క్రితం టెక్నాలజీ గురించి చెప్తే అవహేళన చేశారు. నన్ను 420 అన్న వాళ్ళే… 420 గా మారారు అంటూ ఫైర్ అయ్యారు.

క్వాంటం కంప్యూటర్స్ అమరావతికి తీసుకొచ్చాం. క్వాంటం కంప్యూటర్స్ జనవరిలో ప్రారంభమవుతుంది. జపాన్, అమెరికా సరసన మనం చేరబోతున్నాం అని వ్యాఖ్యానించారు సీఎం చంద్రబాబు.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో సోలార్, విండ్ ఎనర్జీ పెడుతున్నాం. తక్కువ ఖర్చుతో విద్యుత్ తయారు చేయటానికి పని చేస్తున్నాం. వెనుకబడిన అనంతపురంకి కియా తీసుకొచ్చాం. కియా రాకతో అనంతపురంలో పరిస్థితులు మారిపోయాయి. నిత్యవసర వస్తువుగా సెల్ఫోన్ మారింది. లేటెస్ట్ టెక్నాలజీని ఏపీకి తీసుకొస్తాం. రోబోటిక్స్ కూడా ఏపీకి తీసుకొస్తాం అన్నారు.. విశాఖలో 14, 15 తేదీల్లో భాగస్వామ్య సదస్సు పెడుతున్నాం. 50 దేశాల నుండి ప్రతినిధులు వస్తున్నారు. 9 నుండి10 లక్షల కోట్లు పెట్టుబడులు రాబోతున్నాయని వెల్లడించారు. గతంలో ఒక ఫ్యామిలీ ఒక ఐటి అని చెప్పాను. ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఒక వ్యాపారవేత్త అని చెబుతున్నాను అన్నారు.. వెలిగొండ నీళ్లు కనిగిరిని సస్యశ్యామలం చేస్తాయి. 2026 కి వెలిగొండ నీళ్లు ఇచ్చే బాధ్యత నాది. రాయలసీమ ఒకప్పుడు రాళ్ల సీమ.. ఇప్పుడు రాయలసీమ రతనాల సీమ.. గోదావరి నీళ్లు రాయలసీమ తీసుకొచ్చి తాగిస్తా. కులం, మతం అనేది పోవాలి. అభివృద్ధి చేసే వాళ్ళకి ప్రజలు మద్దతుగా ఉండాలని పిలుపునిచ్చారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh job creation
  • Andhra Pradesh MSME inauguration
  • AP industrial parks 2025
  • AP investment news
  • Chandrababu Naidu MSME parks

తాజావార్తలు

  • UstaadBhagatSingh Review : ఉస్తాద్ ఓవర్శీస్ రివ్యూ.. ఇలా అయితే ఎలా హరీష్

  • Qatar-Iran Conflict 2026: ముదిరిన ఖతార్ – ఇరాన్ వివాదం.. ఇంధన యుద్ధం దిశగా పశ్చిమాసియా?

  • Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి పండగపూట అన్ని విజయాలే!

  • Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి రూ.174 కోట్లు తిరిగి చెల్లింపు

  • Off The Record : కాంగ్రెస్ నేత ప్రపోజల్ విని కేటీఆర్ షాక్?

ట్రెండింగ్‌

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • IPL Fastest Ball: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీలు.. టాప్-5లో మనోళ్లు ఇద్దరు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions