CM Chandrababu: ఒకప్పుడు ఏపీ అంటే ఛీ ఛీ అనేవాళ్లు.. ఇప్పుడు భలే భలే అంటున్నారు..
- ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఛీ ఛీ అనేవాళ్లు..
- ఇప్పుడు ఏపీ అంటే భలే భలే అంటున్నారు..
- కనిగిరి కనకపట్నం అవుతుందని బ్రహ్మంగారు చెప్పారు..
- కనిగిరి కనకపట్నం కావడానికి ఎంతో కాలం పట్టదు..
- ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఛీ ఛీ అనేవాళ్లు.. ఇప్పుడు భలే భలే అంటున్నారు అని తెలిపారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని పీసీ పల్లి మండలం లింగన్నపాలెంలో ఎంఎస్ఎంఈ పార్కును ప్రారంభించారు.. ఇదే సమయంలో.. రాష్ట్ర వ్యాప్తంగా 17 జిల్లాలలోని 50 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్ గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కనిగిరి కనకపట్నం అవుతుందని బ్రహ్మంగారు చెప్పారు. కనిగిరి కనకపట్నం కావడానికి ఎంతో కాలం పట్టదు అన్నారు.. తుఫానులో సమర్థవంతంగా పనిచేశాం. అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి పని చేశారు. ప్రాణ, ఆస్తి నష్టం తగ్గించాం అని పేర్కొన్నారు.. చదువుకుంటున్న విద్యార్థులకు చదువులు పూర్తయ్యలోపు స్థానికంగా ఉపాధి కల్పించే బాధ్యత నాది అని తెలిపారు.. అందరూ ఉద్యోగాలు ఇస్తామని చెప్తారు.. కానీ, ఇంటికొక వ్యాపారవేత్తని చేస్తామని హామీ ఇచ్చాను. నేను చేసిన పనులే సాక్షాలు అన్నారు.. 25 ఏళ్ల క్రితం అభివృద్ధి ప్రారంభిస్తే హైదరాబాద్ దేశానికి ఆదర్శంగా నిలిచిందని గుర్తు చేశారు..
Read Also: CM Revanth Reddy: అందెశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలని ప్రధానిని కలిసి విజ్ఞప్తి చేస్తా..
Also Read
- Earthquake In Ongole: ఒంగోలులో భూ ప్రకంపనలు.. భయాందోళనలో ప్రజలు
- Ambati Rambabu: రాజధానిని నిర్మించే స్థాయిలో ఏపీ ఉందా..? అమరావతిపై అంబటి సంచలన వ్యాఖ్యలు
- Markapuram Bus Fire Accident: మార్కాపురం బస్సు దగ్ధం.. బస్సు ఓనర్ కమ్ డ్రైవర్ హరికృష్ణ అరెస్ట్..!
- Markapuram Road Accident: 14 మృతదేహాలకు పోస్ట్మార్టం పూర్తి.. మృతదేహాల గుర్తింపుకోసం డీఎన్ఏ టెస్ట్..
గత పాలకులు చేసిన పనులు బుద్ధి ఉన్న వాళ్ళు ఎవరూ చేయరు అని ఫైర్ అయ్యారు సీఎం చంద్రబాబు.. ప్రజా వేదిక కూల్చడంతో ప్రారంభమైన విధ్వంసం రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. అన్ని తెలిసిన డాక్టర్ ని అయిన నాకే నాడి అంతుబట్టడం లేదు.. ఒకప్పుడు ఏపీ అంటే ఛీ ఛీ అనేవాళ్లు.. ఇప్పుడు ఏపీ అంటే భలేభలే అంటున్నారు. గూగుల్ లాంటి సంస్థలు ఏపీకి వస్తున్నాయి. లక్షా నలభై వేల కోట్లు గూగుల్ ద్వారా పెట్టుబడులు వస్తున్నాయి. ప్రధాని మోడీ, పవన్ కళ్యాణ్, నేను కలిసి కూటమి పెట్టాం. కేంద్రం తీసుకొచ్చే పాలసీలను రాష్ట్రానికి తీసుకువస్తున్నా.. పవన్ కల్యాణ్ కూడా బాగా మద్దతు ఇస్తున్నారు. బాగా చదువుకున్న లోకేష్ కూడా పట్టువదలని విక్రమార్కుడిగా పని చేస్తున్నాడని పేర్కొన్నారు.. చదువుకున్న పిల్లలు గతంలో అమెరికాకి వెళ్లేవాళ్లు.. ఇప్పుడు ఇక్కడే వ్యాపారాలు చేయాలని ఆలోచన చేస్తున్నారు. భవిష్యత్తు టెక్నాలజీ ది.. 35 ఏళ్ల క్రితం టెక్నాలజీ గురించి చెప్తే అవహేళన చేశారు. నన్ను 420 అన్న వాళ్ళే… 420 గా మారారు అంటూ ఫైర్ అయ్యారు.
క్వాంటం కంప్యూటర్స్ అమరావతికి తీసుకొచ్చాం. క్వాంటం కంప్యూటర్స్ జనవరిలో ప్రారంభమవుతుంది. జపాన్, అమెరికా సరసన మనం చేరబోతున్నాం అని వ్యాఖ్యానించారు సీఎం చంద్రబాబు.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో సోలార్, విండ్ ఎనర్జీ పెడుతున్నాం. తక్కువ ఖర్చుతో విద్యుత్ తయారు చేయటానికి పని చేస్తున్నాం. వెనుకబడిన అనంతపురంకి కియా తీసుకొచ్చాం. కియా రాకతో అనంతపురంలో పరిస్థితులు మారిపోయాయి. నిత్యవసర వస్తువుగా సెల్ఫోన్ మారింది. లేటెస్ట్ టెక్నాలజీని ఏపీకి తీసుకొస్తాం. రోబోటిక్స్ కూడా ఏపీకి తీసుకొస్తాం అన్నారు.. విశాఖలో 14, 15 తేదీల్లో భాగస్వామ్య సదస్సు పెడుతున్నాం. 50 దేశాల నుండి ప్రతినిధులు వస్తున్నారు. 9 నుండి10 లక్షల కోట్లు పెట్టుబడులు రాబోతున్నాయని వెల్లడించారు. గతంలో ఒక ఫ్యామిలీ ఒక ఐటి అని చెప్పాను. ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఒక వ్యాపారవేత్త అని చెబుతున్నాను అన్నారు.. వెలిగొండ నీళ్లు కనిగిరిని సస్యశ్యామలం చేస్తాయి. 2026 కి వెలిగొండ నీళ్లు ఇచ్చే బాధ్యత నాది. రాయలసీమ ఒకప్పుడు రాళ్ల సీమ.. ఇప్పుడు రాయలసీమ రతనాల సీమ.. గోదావరి నీళ్లు రాయలసీమ తీసుకొచ్చి తాగిస్తా. కులం, మతం అనేది పోవాలి. అభివృద్ధి చేసే వాళ్ళకి ప్రజలు మద్దతుగా ఉండాలని పిలుపునిచ్చారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!