Site icon NTV Telugu

Earthquake: ప్రకాశం జిల్లాను వదలని భూప్రకంపనలు.. వరుగా 3 సార్లు కంపించిన భూమి

Earthquake

Earthquake

Earthquake: భూప్రకంపనలు ప్రకాశం జిల్లాను వీడడం లేదు.. వరుసగా మూడు రోజుల నుంచి భూప్రకంపనలు సంభవించడంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది.. తాజాగా, ముండ్లమూరు మండలంలో మరోసారి భూ ప్రకంపనలు స్థానికులకు కునుకు లేకుండా చేస్తున్నాయి.. రాత్రి 8:15 నిమిషాలకు.. 8:16 నిమిషాలకు.. 8:19 నిమిషాలకు వరుసగా మూడు సార్లు పెద్ద శబ్దంతో భూమి కంపించినట్టు స్థానికులు చెబుతున్నారు.. అయితే, పెద్ద శబ్దంతో భూమికంపించటంతో ఆందోళనకు గురైన స్థానికులు.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.. అయితే, గత మూడు రోజులుగా ముండ్లమూరులో వరుస భూ ప్రకంపనలు సంభవిస్తున్నాయి.. వరుసగా మూడు రోజులు భూ ప్రకంపనలతో భయాందోళనకు గురవుతున్నారు స్థానికులు.

Read Also: Syam Benagal : ప్రముఖ దర్శకుడు కన్నుమూత

Exit mobile version