Mahanandi Temple: శంభో శివశంభో.. భక్తులతో పోటెత్తిన మహానంది
మహా శివరాత్రికి శైవక్షేత్రాలు భక్తజనసంద్రంగా మారాయి. శివనామస్మరణతో , ఓంకార నాదంతో ప్రముఖ పుణ్యక్షేత్రం మహానంది మారుమోగుతోంది. మహానంది క్షేత్రంలో అంగుళం స్థలం ఖాళీ లేకుండా జన సంద్రమైంది. ఆధ్యాత్మిక ,. సాంస్కృతిక కార్యక్రమాలు హంగామాతో తన్మయం చెందారు లక్షలాదిమంది భక్తులు. అర్ధరాత్రి దాటాక కమనీయంగా, కన్నుల పండుగగా మహానందీశ్వర స్వామి, కామేశ్వరి దేవి అమ్మవారి కళ్యాణోత్సవం జరిగింది. మహానందీశ్వరుని సన్నిధిలో శివరాత్రి జాగరణ చెయ్యడానికి విచ్చేశారు వేలాది మంది భక్తులు. శివనామ స్మరణ చేస్తూ ఓంకారం పలుకుతూ క్యూ లైన్ లో నిరీక్షణ చేసి స్వామివారిని దర్శించుకున్నారు. నిజరూపంలో భక్తులకు దర్శనమిచ్చాడు మహానందీశ్వర స్వామి.
జాగరణ కోసం పోటెత్తారు జనం. వీరికి అన్నదానాన్ని అల్పాహారాన్ని అందించాయి పలు కుల , ప్రజా సంఘాలు. చెక్కభజన ,కోలాటం,తప్పెట్ల్లు ,కేరళ సింగారి మేళం తెల్లవారే వరకు హోరెత్తించాయి. ఈ సాంస్కృతిక కార్యక్రమాలను విశేషంగా ఆదరించారు భక్తులు. ఆలయం ప్రాంగణంలోని విద్యుత్ దీపాల అలంకరణ కైలాసాన్ని మరిపించింది. మహానంది క్షేత్రంలో మహానందీశ్వర స్వామి కామేశ్వరి దేవి అమ్మవారు కళ్యాణాన్ని కమనీయంగా పనుల పండుగగా నిర్వహించారు వేద పండితులు. శతాబ్దాలుగా వస్తున్న ఆచారం ప్రకారం పెళ్లి పెద్దలుగా ఉంటూ కళ్యాణాన్ని జరిపించారు బ్రహ్మనందీశ్వర స్వామి, పార్వతీదేవి అమ్మవార్లు.
Also Read
- Gudivada Amarnath: డేటా సెంటర్పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
- Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
- Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
చిన్న తిరుపతిలో మహా సుదర్శన యజ్ఞం
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం ఐ ఎస్ జగన్నాధపురంలో సుందరగిరిపై స్వయంభువుగా కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జ్వాలా సంపుటిత మహా సుదర్శన యజ్ఞం కన్నుల పండువుగా జరిగింది. మహాశివరాత్రి సందర్భంగా లోక శాంతి కోసం యజ్ఞాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. 17 వేల రుద్రనామాలతో రుద్రహోమాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు.
యజ్ఞంలో 1331 కలశాలను ఉంచి సహస్ర కలషాభిషేకం చేశారు. శాలిగ్రామ అభిషేకాలు నిర్వహించారు. యజ్ఞకుండంలో ఔషధ పదార్థాలు, లోహాలు మరియు పలు రకాల పూజ ద్రవ్యాలను వేశారు. హైదరాబాద్ కి చెందిన నరసింహ గురూజీ గత 29 సంవత్సరాలుగా ప్రతి ఏటా మహాశివరాత్రి పర్వదినాన జ్వాలా సంపుటిత మహా సుదర్శన యజ్ఞాన్ని నిర్వహించడం ఇక్కడ ఆనవాయితి… యజ్ఞాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. ముందుగా స్వామిని దర్శించి, భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన యల్ఈడి స్క్రీన్ లపై యజ్ఞాన్ని తిలకించారు. యజ్ఞంలో సినీ, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
-
UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
-
Afghanistan: తాలిబన్లకు దొరికిన వేల కోట్ల నిధి.. భారత్కు అత్యంత తక్కువ ధరకే ఆయిల్ సప్లై చేసే ఛాన్స్!
-
Food poisoning: బిర్యానీ, వాటర్మిలన్ కలిపి తింటే ప్రమాదమా..? శరీరంలో ఏం జరుగుతుంది?
-
Dhanush: రామ్ చరణ్ కాదంట.. ధనుష్తో భన్సాలీ సినిమా! అసలు కథ ఇదే..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో