Mahanandi Temple: శంభో శివశంభో.. భక్తులతో పోటెత్తిన మహానంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహా శివరాత్రికి శైవక్షేత్రాలు భక్తజనసంద్రంగా మారాయి. శివనామస్మరణతో , ఓంకార నాదంతో ప్రముఖ పుణ్యక్షేత్రం మహానంది మారుమోగుతోంది. మహానంది క్షేత్రంలో అంగుళం స్థలం ఖాళీ లేకుండా జన సంద్రమైంది. ఆధ్యాత్మిక ,. సాంస్కృతిక కార్యక్రమాలు హంగామాతో తన్మయం చెందారు లక్షలాదిమంది భక్తులు. అర్ధరాత్రి దాటాక కమనీయంగా, కన్నుల పండుగగా మహానందీశ్వర స్వామి, కామేశ్వరి దేవి అమ్మవారి కళ్యాణోత్సవం జరిగింది. మహానందీశ్వరుని సన్నిధిలో శివరాత్రి జాగరణ చెయ్యడానికి విచ్చేశారు వేలాది మంది భక్తులు. శివనామ స్మరణ చేస్తూ ఓంకారం పలుకుతూ క్యూ లైన్ లో నిరీక్షణ చేసి స్వామివారిని దర్శించుకున్నారు. నిజరూపంలో భక్తులకు దర్శనమిచ్చాడు మహానందీశ్వర స్వామి.
జాగరణ కోసం పోటెత్తారు జనం. వీరికి అన్నదానాన్ని అల్పాహారాన్ని అందించాయి పలు కుల , ప్రజా సంఘాలు. చెక్కభజన ,కోలాటం,తప్పెట్ల్లు ,కేరళ సింగారి మేళం తెల్లవారే వరకు హోరెత్తించాయి. ఈ సాంస్కృతిక కార్యక్రమాలను విశేషంగా ఆదరించారు భక్తులు. ఆలయం ప్రాంగణంలోని విద్యుత్ దీపాల అలంకరణ కైలాసాన్ని మరిపించింది. మహానంది క్షేత్రంలో మహానందీశ్వర స్వామి కామేశ్వరి దేవి అమ్మవారు కళ్యాణాన్ని కమనీయంగా పనుల పండుగగా నిర్వహించారు వేద పండితులు. శతాబ్దాలుగా వస్తున్న ఆచారం ప్రకారం పెళ్లి పెద్దలుగా ఉంటూ కళ్యాణాన్ని జరిపించారు బ్రహ్మనందీశ్వర స్వామి, పార్వతీదేవి అమ్మవార్లు.
Also Read
- Traffic Jam : శ్రీశైలం వద్ద ట్రాఫిక్ నరకం.. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు!
- Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
చిన్న తిరుపతిలో మహా సుదర్శన యజ్ఞం
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం ఐ ఎస్ జగన్నాధపురంలో సుందరగిరిపై స్వయంభువుగా కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జ్వాలా సంపుటిత మహా సుదర్శన యజ్ఞం కన్నుల పండువుగా జరిగింది. మహాశివరాత్రి సందర్భంగా లోక శాంతి కోసం యజ్ఞాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. 17 వేల రుద్రనామాలతో రుద్రహోమాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు.
యజ్ఞంలో 1331 కలశాలను ఉంచి సహస్ర కలషాభిషేకం చేశారు. శాలిగ్రామ అభిషేకాలు నిర్వహించారు. యజ్ఞకుండంలో ఔషధ పదార్థాలు, లోహాలు మరియు పలు రకాల పూజ ద్రవ్యాలను వేశారు. హైదరాబాద్ కి చెందిన నరసింహ గురూజీ గత 29 సంవత్సరాలుగా ప్రతి ఏటా మహాశివరాత్రి పర్వదినాన జ్వాలా సంపుటిత మహా సుదర్శన యజ్ఞాన్ని నిర్వహించడం ఇక్కడ ఆనవాయితి… యజ్ఞాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. ముందుగా స్వామిని దర్శించి, భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన యల్ఈడి స్క్రీన్ లపై యజ్ఞాన్ని తిలకించారు. యజ్ఞంలో సినీ, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ‘నా ఆట బానే ఉంటుంది కదా.. మరి వాళ్లు అలా ఎందుకు చేశారు’.. భావోద్వేగానికి గురైన సూర్యవంశీ..
-
Varanasi: వారణాసి నుంచి మాంసం దుకాణాలు అవుట్..
-
Peddi Deleted Scenes: రావు రమేష్, జగపతి బాబు సీన్లను ఎడిటింగ్లో ఎందుకు లేపేశారో చెప్పిన బుచ్చిబాబు!
-
Bhatti Vikramarka : తప్పుడు ప్రచారాలు మానండి.. రైతులకు ఉచిత కరెంట్ ఆగదు
-
‘Peddi’: టాలీవుడ్ అంటే అంత అలుసా? ‘పెద్ది’ విషయంలో ఇండస్ట్రీ మౌనమేల?
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!