Bhumana: టీడీపీ హయాంలో భారీ కుట్ర.. ఇందులో చంద్రబాబు పాత్ర ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డేటా చౌర్యంపై అమరావతిలోని సచివాలయంలో హౌస్ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా హౌస్ కమిటీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి మాట్లాడుతూ.. సాధికార సర్వే ద్వారా వచ్చిన సమాచారం సేవా మిత్ర అనే ప్రైవేట్ సంస్థకి చంద్రబాబు ప్రభుత్వం అప్పగించారని.. పార్టీ కార్యకర్తలకు ఇచ్చి తమకు అనుకూలంగా లేనివారి ఓట్లు తొలగించాలని చూశారని ఆరోపించారు. అప్పటి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడానికి ప్రజాస్వామ్యం ఖూనీ చేసినట్లు నిర్ధారణకు వచ్చామన్నారు. డేటా చౌర్యం వెనుక చాలా పెద్దవాళ్ళ సహకారం ఉందని.. వాళ్లు సమాచారం దొంగిలించి కుట్ర చేశారని భూమన వ్యాఖ్యానించారు. కింది స్థాయి ఉద్యోగులు ఈ నేరం చేయలేదని.. 35 లక్షల నుంచి 40 లక్షల ఓట్లు తొలగించేందుకు ప్రయత్నించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారన్నారు. ఈ కుట్ర వెనుక చంద్రబాబు పాత్ర ఉందని భూమన విమర్శలు చేశారు. అయితే ఈ కుట్రను తాము అడ్డుకున్నామన్నారు.
Read Also: Varla Ramaiah : పాలకులు తమ చిత్త శుద్ది నిరూపించుకోవాలి
Also Read
- నేడే ఏపీ Cabinet Meeting.. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్సిగ్నల్.. పొదుపు చర్యలపై కీలక చర్చ!
- CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
- CM Chandrababu Naidu: వర్క్ ఫ్రం హోంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
ఉద్దేశపూర్వకంగా అప్పటి ప్రభుత్వం పనిగట్టుకుని అప్పటి ప్రతిపక్షంలో ఉన్న తమను అధికారంలోకి రాకుండా చేయాలని కుట్ర చేసిందని పెగాసస్ హౌస్ కమిటీ ఛైర్మన్ భూమన అన్నారు. డేటా ఇతర మార్గాల ద్వారా బయటకు వెళ్లే అవకాశం లేదని అధికారులు విచారణలో స్పష్టం చేశారన్నారు. హోంశాఖ, ఐటీ శాఖ, పోలీస్ శాఖ అధికారులను విచారించామని.. సేవామిత్ర యాప్ ద్వారా ఇంటింటి సర్వే చేసి ఓటర్ల అభిప్రాయాల ఆధారంగా వైసీపీకి అనుకూలంగా ఉన్న వారిని నిర్ణయించారన్నారు. 100 శాతం గత ప్రభుత్వంలో డేటా చౌర్యం జరిగిందని.. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఇది నేరమన్నారు. దీనిపై పోలీస్ దర్యాప్తు కూడా జరగాలని భూమన అభిప్రాయపడ్డారు. ఇది పెగాసస్పై విచారణ కాదని.. డేటా చౌర్యంపై విచారణ అని స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికి సీఎంకు, స్పీకర్ కు ఈ అంశంపై నివేదిక ఇస్తామన్నారు.
టీడీపీ ప్రభుత్వం లక్షలాది మంది ప్రజల జీవితాలతో ఆడుకునే ప్రయత్నం చేసిందని ఎన్టీవీతో పెగాసెస్ కమిటీ సభ్యుడు అబ్బయ్య చౌదరి వ్యాఖ్యానించారు. డేటా చౌర్యం భారీ కుట్ర అని.. హోం శాఖ, ఐటీ ఇతర శాఖల అధికారుల నుంచి వివరాలు తీసుకున్నామని తెలిపారు. మరింత లోతుగా కమిటీ డేటా చౌర్యం ఎలా జరిగిందనే విషయాలను విశ్లేషిస్తోందని పేర్కొన్నారు. వచ్చే సమావేశానికి గతంలో డేటా విభాగంలో పని చేసిన అధికారులు, సిబ్బందిని పిలుస్తున్నామన్నారు. అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం ఇదే అంశంపై సిట్ వేసిందని.. ఆ నివేదికను ఇవ్వాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం అడిగే అవకాశం ఉందన్నారు. ఈ నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో హౌజ్ కమిటీ నివేదిక సభ ముందు పెడుతుందని తెలిపారు.
తాజావార్తలు
-
RAPO 23 : దర్శకుడుగా హీరో రామ్.. రేపు అధికారిక ప్రకటన.!
-
Tata Altroz iCNG AMT: టాటా ఆల్ట్రోజ్ iCNG AMT విడుదల.. సేఫ్ & స్మార్ట్ CNG అటోమేటిక్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
Karuppu : కరుప్పు రిలీజ్ కష్టాలు.. కన్నీళ్లు పెట్టుకున్న డైరెక్టర్
-
Virat Kohli Century: “నేనే చెప్పాను కదా.. అందుకే”.. కోహ్లీ సెంచరీపై తర్వాత కృనాల్ పాండ్యా వైరల్ పోస్ట్..!
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!