Peddireddy Ramachandra Reddy: చంద్రబాబుకి, జగన్కి.. నక్కకి, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Peddireddy Ramachandra Reddy Focus On Group Politics: చంద్రబాబుకు, సీఎం జగన్కు మధ్య నక్కకి, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అందరూ కలిసి పార్టీ కోసం పని చేసేలా అందరినీ కలుపుకుని వెళ్ళాలని.. జగన్ మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేసేలా అందరూ కష్టపడాలని వైసీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సీఎం జగన్ ప్రతి జిల్లాకు ఒక రీజనల్ కోఆర్డినేటర్, ప్రతి నియోజకవర్గానికి ఒక పరిశీలకుడును నియమించారన్నారు. పరిపాలన మన ఇంటి ముంగిటకు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారని.. పార్టీ బలోపేతంపై దృష్టి సారించారన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈసారి 14కు 14 సీట్లు వైసీపీ కేవసం చేసుకునేలా అందరూ కృషి చేద్దామని అన్నారు.
కాగా.. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలలోని పలు అసెంబ్లీ నియోజకవర్గా్ల్లో నేతల మధ్య విభేదాలు తలెత్తాయి. ఇది గమనించిన వైసీపీ అధిష్టానం.. ఆ విభేదాల్ని చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలోనే మంత్రి పెద్దిరెడ్డి రంగంలోకి దిగి, నియోజకవర్గాలపై సమీక్ష నిర్వహించారు. గ్రూప్ పాలిటిక్స్పై అసహనం వ్యక్తం చేశారు. పార్టీలో ఇలాంటి వాటిని సహించేది లేదని, నాయకులపై అసమ్మతి లేని నియోజకవర్గం ఉండదని, అన్నింటినీ సామరస్యంగా పరిష్కరించుకొని ముందుకెళ్లాలని సూచించారు. పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి నియోజకవర్గంలో సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. పార్టీలో క్రమశిక్షణ పాటించని నాయకులు, కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. విభేదాల్ని పక్కన పెట్టి.. అందరూ కలిసి పని చేయాలని కోరారు.
Also Read
- Dr Priyanka హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. పోలీసులను కలిసిన కుటుంబ సభ్యులు!
- Nara Lokesh: రెన్యూవబుల్ ఎనర్జీలో ఏపీకి నంబర్-1 టార్గెట్.. నారా లోకేష్ కీలక ప్రకటన!
- RK Roja: స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి.. ప్రతిచోటా పోటీ చేస్తాం..
- YS Jagan: వ్యవస్థలన్నీ కుప్పకూలాయి.. ప్రతి ఇంట్లో వైసీపీ, కూటమి పాలనపై చర్చ జరుగుతోంది..
ఇదే సమయంలో.. శ్రీ సత్యసాయి జిల్లాలో పార్టీ పరిస్థితిపై మంత్రి పెద్దిరెడ్డి సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు. హిందూపురంలో ఎమ్మెల్సీ ఇక్బాల్, నవీన్ నిశ్చల్, చౌలురు రామకృష్ణారెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్న నేపథ్యంలో.. ఆ నేతలతో సమావేశం కానున్నారు. వారి మధ్య విభేదాల్ని సామరస్యంగా పరిష్కరించే పనిలో నిమగ్నమయ్యారు. అనంతరం డిసెంబర్ 17వ తేదీన పెనుకొండ, ధర్మవరంలో పెద్ద ఎత్తున సభలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత డిసెంబర్ 18న పుట్టపర్తి, కదిరిలో పెద్దిరెడ్డి పర్యటించనున్నారు.
తాజావార్తలు
-
Kishan Reddy: రేవంత్ అమెరికా టూర్ రద్దు.. కిషన్ రెడ్డి కౌంటర్..!
-
Arvind Kejriwal: ఆప్ గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. కేజ్రీవాల్ హామీ..
-
BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
-
Tollywood Debut: బిగ్ బాస్ బ్యూటీకి బిగ్ ఛాన్స్.. హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ!
-
Earthquake: 7 రోజుల్లో 187 భూకంపాలు.. “రింగ్ ఆఫ్ ఫైర్”లో ఏం జరుగుతోంది?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!