Nara Lokesh: ఎన్టీఆర్ దేవుడు.. చంద్రబాబు రాముడు.. మీలాంటోళ్లకు నేను మూర్ఖుడిని..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో గురువారం సాయంత్రం టీడీపీ నేత నారా లోకేష్ పర్యటించారు. బొల్లాపల్లి మండలం రావులాపురంలో హత్యకు గురైన టీడీపీ కార్యకర్త జల్లయ్య కుటుంబాన్ని లోకేష్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ శ్రేణులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. కారు ముందు భాగంలో కూర్చుని అభిమానులకు లోకేష్ అభివాదాలు చేశారు. అనంతరం లోకేష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. తమ కార్యకర్తలను హత్య చేస్తే భయపడతామని జగన్ మాఫియా రెడ్డి భ్రమపడుతున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యల గురించి తాము పోరాడుతుంటే ఈ ప్రభుత్వం అడ్డగోలుగా కేసులు పెడుతోందని విమర్శలు చేశారు. అధికారులు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలని.. జగన్ మాఫియా రెడ్డి శాశ్వతం కాదని.. వ్యవస్థలు శాశ్వతం అని, రాష్ట్రం శాశ్వతం అని లోకేష్ వ్యాఖ్యానించారు.
మరోవైపు లోకేష్ సినిమా తరహాలో పవర్ఫుల్ డైలాగులు కూడా చెప్పారు. అన్న ఎన్టీఆర్ తమకు దేవుడు అని.. చంద్రబాబు తమకు రాముడు అని.. కానీ లోకేష్ మాత్రం మీ లాంటోళ్లకు మూర్ఖుడు అని వైసీపీ నేతలను ఉద్దేశించి మాట్లాడారు. లోకేష్ ఈ డైలాగ్ చెప్పగానే అక్కడున్న టీడీపీ నేతలు విజిళ్లతో హోరెత్తించారు. రాముడు అయినా మరిచిపోతాడేమో కానీ.. తాను మాత్రం వైసీపీ వాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. జగన్ వేల కిలోమీటర్లు పాదయాత్ర ఎలా చేశారో వైసీపీ నేతలు ఒకసారి గుర్తుతెచ్చుకోవాలని.. ఆనాడు జెడ్ ప్లస్ కేటగిరీలో భద్రత కల్పించాం కాబట్టే జగన్ పాదయాత్ర చేయగలిగాడని లోకేష్ పేర్కొన్నారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేరు మార్చుకోవాలని.. పిల్లి రామకృష్ణారెడ్డి అని పెట్టుకోవాలని లోకేష్ సూచించారు.
Also Read
- YS Jagan: ‘రెడ్ బుక్ గవర్నెన్స్’ గ్లోబల్ అయ్యింది.. ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఫైర్
- Polavaram District: ఏపీలో విషాదం.. ఒకే ప్రియుడి కోసం ఇద్దరు యువతులు ఆత్మహత్య..
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
- Gadikota Srikanth Reddy: కొత్త పెన్షన్ల పేరుతో మళ్లీ మోసం.. గడికోట ఫైర్
తాజావార్తలు
-
UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
-
Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
-
YS Jagan: ‘రెడ్ బుక్ గవర్నెన్స్’ గ్లోబల్ అయ్యింది.. ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఫైర్
-
TGSRTC : బస్టాండ్ ఇక కేవలం బస్టాండ్ మాత్రమే కాదు.. మాల్ను తలపించేలా కొత్త లుక్
-
Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!