Nara Lokesh-Dallas: మా కుటుంబానికి ప్రవాసాంధ్రులు కొండంత బలం.. గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం!
- ప్రతిపక్షంలో ఉన్నపుడు ప్రవాసాంధ్రులు అండగా నిలిచారు
- మా కుటుంబానికి ప్రవాసాంధ్రులు కొండంత బలం
- 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతిపక్షంలో ఉన్నపుడు కూడా ప్రవాసాంధ్రులు తమకు అండగా నిలిచారని ఏపీ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. తమ కుటుంబానికి ప్రవాసాంధ్రులు కొండంత బలం అని, వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామన్నారు. తెలుగువాళ్లు దశాబ్దాల క్రితమే అమెరికాకు వచ్చారని పేరొన్నారు. విదేశాల్లో ఉన్న తెలుగు వారికి ఏ కష్టం వచ్చినా ఏపీ ఎన్ఆర్టీ అండగా ఉంటుందని చెప్పారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని నారా లోకేష్ చెప్పుకొచ్చారు. డాలస్లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో నారా లోకేష్ పాల్గొన్నారు.
‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన ప్రవాసాంధ్రులను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం. మా కుటుంబానికి మీరు కొండంత బలం ఇచ్చారు. స్పీడ్కు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్గా మారింది. 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. వారు వై నాట్ 175 అంటే.. ప్రజలే వై నాట్ 11 అని అన్నారు. ప్రవాసాంధ్రుల మద్దతుతో కూటమి సూపర్ హిట్ అయ్యింది, వైసీపీ 11కి ఆలౌట్ అయింది. అమెరికాలో తెలుగు వాళ్లు సత్తా చాటారు. కష్ట కాలంలో మీరంతా మా కుటుంబానికి అండగా నిలిచారు. విదేశాల్లో ఉన్న తెలుగువారికి ఏ కష్టం వచ్చినా ఏపీ ఎన్ఆర్టీ అండగా ఉంటుంది’ అని మంత్రి నారా లోకేష్ అన్నారు.
Also Read
- CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్పై సీఎం చంద్రబాబు ఫైర్!
- Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- AP TET 2026: ఏపీ టెట్ షెడ్యూల్ వచ్చేసింది.. జూన్ 5న నోటిఫికేషన్.. పరీక్షలు ఎప్పుడంటే..
Also Read: Virat Kohli: సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న ‘కింగ్’ కోహ్లీ.. ఫొటోలు వైరల్!
‘విడాకులు, క్రాస్ ఫైర్లు, మిస్ ఫైర్లు లేకుండా మరో 15 ఏళ్లు ఎన్డీయే కూటమి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తుంది. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టం. మేం కక్షసాధింపులకు పాల్పడటం లేదు. సీఎం చంద్రబాబుని 53 రోజులు పాటు జైలులో ఉంచినప్పుడు ప్రవాసాంధ్రులు మాకు అండగా నిలిచారు. 2019-2024 మధ్య ఎంతటి విధ్వంస పాలన జరిగిందో అందరికీ తెలుసు. అందుకే సిద్ధం అంటూ వచ్చిన పార్టీని ప్రజలు భూస్థాపితం చేశారు. రాబోయే రోజుల్లో రికార్డులు తిరగరాస్తాం. దేశంలో పలు రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్లు ఉంటే.. ఏపీలోనే డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉంది’ అని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
K Annamalai: “కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా”.. అన్నామలై సంచలన ప్రకటన..
-
Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
-
EPFO: ఈపీఎఫ్ఓ కొత్త నిబంధనలు.. UAN యాక్టివేషన్ ప్రక్రియలో కీలక మార్పులు
-
Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..