Nara Lokesh-Dallas: మా కుటుంబానికి ప్రవాసాంధ్రులు కొండంత బలం.. గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం!
- ప్రతిపక్షంలో ఉన్నపుడు ప్రవాసాంధ్రులు అండగా నిలిచారు
- మా కుటుంబానికి ప్రవాసాంధ్రులు కొండంత బలం
- 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతిపక్షంలో ఉన్నపుడు కూడా ప్రవాసాంధ్రులు తమకు అండగా నిలిచారని ఏపీ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. తమ కుటుంబానికి ప్రవాసాంధ్రులు కొండంత బలం అని, వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామన్నారు. తెలుగువాళ్లు దశాబ్దాల క్రితమే అమెరికాకు వచ్చారని పేరొన్నారు. విదేశాల్లో ఉన్న తెలుగు వారికి ఏ కష్టం వచ్చినా ఏపీ ఎన్ఆర్టీ అండగా ఉంటుందని చెప్పారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని నారా లోకేష్ చెప్పుకొచ్చారు. డాలస్లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో నారా లోకేష్ పాల్గొన్నారు.
‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన ప్రవాసాంధ్రులను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం. మా కుటుంబానికి మీరు కొండంత బలం ఇచ్చారు. స్పీడ్కు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్గా మారింది. 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. వారు వై నాట్ 175 అంటే.. ప్రజలే వై నాట్ 11 అని అన్నారు. ప్రవాసాంధ్రుల మద్దతుతో కూటమి సూపర్ హిట్ అయ్యింది, వైసీపీ 11కి ఆలౌట్ అయింది. అమెరికాలో తెలుగు వాళ్లు సత్తా చాటారు. కష్ట కాలంలో మీరంతా మా కుటుంబానికి అండగా నిలిచారు. విదేశాల్లో ఉన్న తెలుగువారికి ఏ కష్టం వచ్చినా ఏపీ ఎన్ఆర్టీ అండగా ఉంటుంది’ అని మంత్రి నారా లోకేష్ అన్నారు.
Also Read
- Dokka Seethamma Mid-Day Meal : స్మార్ట్ కిచెన్స్పై క్లారిటీ.. వంట కార్మికులకు గుడ్ న్యూస్.!
- CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
- OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్... మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
Also Read: Virat Kohli: సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న ‘కింగ్’ కోహ్లీ.. ఫొటోలు వైరల్!
‘విడాకులు, క్రాస్ ఫైర్లు, మిస్ ఫైర్లు లేకుండా మరో 15 ఏళ్లు ఎన్డీయే కూటమి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తుంది. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టం. మేం కక్షసాధింపులకు పాల్పడటం లేదు. సీఎం చంద్రబాబుని 53 రోజులు పాటు జైలులో ఉంచినప్పుడు ప్రవాసాంధ్రులు మాకు అండగా నిలిచారు. 2019-2024 మధ్య ఎంతటి విధ్వంస పాలన జరిగిందో అందరికీ తెలుసు. అందుకే సిద్ధం అంటూ వచ్చిన పార్టీని ప్రజలు భూస్థాపితం చేశారు. రాబోయే రోజుల్లో రికార్డులు తిరగరాస్తాం. దేశంలో పలు రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్లు ఉంటే.. ఏపీలోనే డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉంది’ అని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
IND Vs IRE: టీమిండియాకు షాక్.. కొంపముంచనున్న వర్షం.. ఐర్లాండ్దే సిరీస్..
-
NTR – Trivikram Movie: రేపే ఎన్టీఆర్-త్రివిక్రమ్ ‘God Of War’ అనౌన్స్మెంట్!
-
Garuda Puran: చనిపోయిన వారి బట్టలు ఇంట్లో ఉంచుతున్నారా? గరుడ పురాణంలో చెప్పిన భయంకరమైన నిజాలు ఇవే!
-
Komatireddy Venkat Reddy : రేవంత్పై కోమటిరెడ్డి ప్రశంసలు.. నల్లగొండలో 12 సీట్లు మావే.!
-
Womens T20 World Cup: ముగిసిన టీమిండియా బ్యాటింగ్.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!