Nara Lokesh-Dallas: మా కుటుంబానికి ప్రవాసాంధ్రులు కొండంత బలం.. గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం!
- ప్రతిపక్షంలో ఉన్నపుడు ప్రవాసాంధ్రులు అండగా నిలిచారు
- మా కుటుంబానికి ప్రవాసాంధ్రులు కొండంత బలం
- 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం
ప్రతిపక్షంలో ఉన్నపుడు కూడా ప్రవాసాంధ్రులు తమకు అండగా నిలిచారని ఏపీ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. తమ కుటుంబానికి ప్రవాసాంధ్రులు కొండంత బలం అని, వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామన్నారు. తెలుగువాళ్లు దశాబ్దాల క్రితమే అమెరికాకు వచ్చారని పేరొన్నారు. విదేశాల్లో ఉన్న తెలుగు వారికి ఏ కష్టం వచ్చినా ఏపీ ఎన్ఆర్టీ అండగా ఉంటుందని చెప్పారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని నారా లోకేష్ చెప్పుకొచ్చారు. డాలస్లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో నారా లోకేష్ పాల్గొన్నారు.
‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన ప్రవాసాంధ్రులను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం. మా కుటుంబానికి మీరు కొండంత బలం ఇచ్చారు. స్పీడ్కు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్గా మారింది. 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. వారు వై నాట్ 175 అంటే.. ప్రజలే వై నాట్ 11 అని అన్నారు. ప్రవాసాంధ్రుల మద్దతుతో కూటమి సూపర్ హిట్ అయ్యింది, వైసీపీ 11కి ఆలౌట్ అయింది. అమెరికాలో తెలుగు వాళ్లు సత్తా చాటారు. కష్ట కాలంలో మీరంతా మా కుటుంబానికి అండగా నిలిచారు. విదేశాల్లో ఉన్న తెలుగువారికి ఏ కష్టం వచ్చినా ఏపీ ఎన్ఆర్టీ అండగా ఉంటుంది’ అని మంత్రి నారా లోకేష్ అన్నారు.
Also Read
- Student Suicide: నిండు ప్రాణాన్ని బలితీసుకున్న నిరుద్యోగం.. కలల కొలువు దక్కకపోవడంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
- CM Chandrababu: స్టేజ్పైనే అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్.. పనితీరుపై సీరియస్ వార్నింగ్..
- Ambati Rambabu: అమరావతి నా జన్మలోనే కాదు.. చంద్రబాబు, లోకేష్ జన్మలో కూడా పూర్తి కాదు..!
- CM Chandrababu: ఏపీ ప్రజలకు NDA వల్ల మరోసారి స్వాతంత్య్రం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Also Read: Virat Kohli: సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న ‘కింగ్’ కోహ్లీ.. ఫొటోలు వైరల్!
‘విడాకులు, క్రాస్ ఫైర్లు, మిస్ ఫైర్లు లేకుండా మరో 15 ఏళ్లు ఎన్డీయే కూటమి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తుంది. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టం. మేం కక్షసాధింపులకు పాల్పడటం లేదు. సీఎం చంద్రబాబుని 53 రోజులు పాటు జైలులో ఉంచినప్పుడు ప్రవాసాంధ్రులు మాకు అండగా నిలిచారు. 2019-2024 మధ్య ఎంతటి విధ్వంస పాలన జరిగిందో అందరికీ తెలుసు. అందుకే సిద్ధం అంటూ వచ్చిన పార్టీని ప్రజలు భూస్థాపితం చేశారు. రాబోయే రోజుల్లో రికార్డులు తిరగరాస్తాం. దేశంలో పలు రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్లు ఉంటే.. ఏపీలోనే డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉంది’ అని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Bengal Repolling: పశ్చిమ బెంగాల్లో రీపోలింగ్.. 15 కేంద్రాల్లో మళ్లీ ఓటింగ్..
-
AI Astrology App : AI జ్యోతిష్యం.. భవిష్యత్తు చెప్పే యాప్.!
-
UAE: 48 గంటల్లో దేశం విడిచి వెళ్లండి.. పాకిస్తానీ ఉద్యోగులకు యూఏఈ షాక్..
-
Vaibhav Sooryavanshi: అభిషేక్ శర్మ రికార్డుకు చెక్ పెట్టిన వైభవ్ సూర్యవంశీ.. ఒక్క అడుగు దూరంలోనే..
-
TRS : తెలంగాణ రక్షణ సేనలోకి మాజీ మంత్రి.. పార్టీ అధ్యక్షురాలు కవితతో భేటీ
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!