Nara Lokesh-Dallas: మా కుటుంబానికి ప్రవాసాంధ్రులు కొండంత బలం.. గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం!
- ప్రతిపక్షంలో ఉన్నపుడు ప్రవాసాంధ్రులు అండగా నిలిచారు
- మా కుటుంబానికి ప్రవాసాంధ్రులు కొండంత బలం
- 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతిపక్షంలో ఉన్నపుడు కూడా ప్రవాసాంధ్రులు తమకు అండగా నిలిచారని ఏపీ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. తమ కుటుంబానికి ప్రవాసాంధ్రులు కొండంత బలం అని, వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామన్నారు. తెలుగువాళ్లు దశాబ్దాల క్రితమే అమెరికాకు వచ్చారని పేరొన్నారు. విదేశాల్లో ఉన్న తెలుగు వారికి ఏ కష్టం వచ్చినా ఏపీ ఎన్ఆర్టీ అండగా ఉంటుందని చెప్పారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని నారా లోకేష్ చెప్పుకొచ్చారు. డాలస్లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో నారా లోకేష్ పాల్గొన్నారు.
‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన ప్రవాసాంధ్రులను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం. మా కుటుంబానికి మీరు కొండంత బలం ఇచ్చారు. స్పీడ్కు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్గా మారింది. 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. వారు వై నాట్ 175 అంటే.. ప్రజలే వై నాట్ 11 అని అన్నారు. ప్రవాసాంధ్రుల మద్దతుతో కూటమి సూపర్ హిట్ అయ్యింది, వైసీపీ 11కి ఆలౌట్ అయింది. అమెరికాలో తెలుగు వాళ్లు సత్తా చాటారు. కష్ట కాలంలో మీరంతా మా కుటుంబానికి అండగా నిలిచారు. విదేశాల్లో ఉన్న తెలుగువారికి ఏ కష్టం వచ్చినా ఏపీ ఎన్ఆర్టీ అండగా ఉంటుంది’ అని మంత్రి నారా లోకేష్ అన్నారు.
Also Read
- CM Chandrababu : అమరావతి దేవతల రాజధాని.. నవ్యాంధ్రను నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
- CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
- RAW NTR: 'ఊరు–వాడ' కార్యక్రమంపై 'రా ఎన్టీఆర్' కీలక ప్రకటన.. ఆరోపణలకు కౌంటర్..
Also Read: Virat Kohli: సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న ‘కింగ్’ కోహ్లీ.. ఫొటోలు వైరల్!
‘విడాకులు, క్రాస్ ఫైర్లు, మిస్ ఫైర్లు లేకుండా మరో 15 ఏళ్లు ఎన్డీయే కూటమి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తుంది. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టం. మేం కక్షసాధింపులకు పాల్పడటం లేదు. సీఎం చంద్రబాబుని 53 రోజులు పాటు జైలులో ఉంచినప్పుడు ప్రవాసాంధ్రులు మాకు అండగా నిలిచారు. 2019-2024 మధ్య ఎంతటి విధ్వంస పాలన జరిగిందో అందరికీ తెలుసు. అందుకే సిద్ధం అంటూ వచ్చిన పార్టీని ప్రజలు భూస్థాపితం చేశారు. రాబోయే రోజుల్లో రికార్డులు తిరగరాస్తాం. దేశంలో పలు రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్లు ఉంటే.. ఏపీలోనే డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉంది’ అని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
-
CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
-
Chennai Love Story Trailer: కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్ చూశారా!
-
IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
-
Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!