NTV Telugu Site icon

ఫ్యాన్‌కి ఓటేస్తే ఇంట్లో ఉన్న ఫ్యాన్ ఆగిపోయింది… లోకేష్‌ సెటైర్లు

Nara-Lokesh

Nara-Lokesh

ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ సర్కార్‌, సీఎం వైఎస్‌ జగన్‌పై విద్యుత్‌ సంక్షోభం విషయంలో సెటైర్లు వేశారు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌.. రాష్ట్రాన్ని అంధకారాంధ్రప్రదేశ్ గా మార్చేశారని ఫై అయిన ఆయన.. ఫ్యాన్‌కి ఓటేస్తే ఇంట్లో ఉన్న ఫ్యాన్ ఆగిపోయింది అంటూ ఎద్దేవా చేశారు.. ఒక పక్క విద్యుత్ ఛార్జీల పెంపు పేరుతో బాదుడే బాదుడు.. మరోపక్క విద్యుత్ కోతలతో అంధకారం అని ఆవేదన వ్యక్తం చేశారు. బొగ్గు కొరత ఏర్పడుతుంది జాగ్రత్త పడండని.. 40 రోజుల ముందే కేంద్రం హెచ్చరించినా.. తాడేపల్లి ప్యాలస్సులో నిద్రపోతున్న జగన్‌లో చలనం లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బొగ్గు ఉత్పత్తి సంస్థలకు చెల్లించాల్సిన రూ.215 కోట్ల బకాయిలని చెల్లించకపోవడం దారణమన్న నారా లోకేష్‌.. అవసరం మేర బొగ్గు నిల్వ చేసుకోవాలన్న కేంద్రం హెచ్చరికల్ని పెడచెవిన పెట్టారని ఆరోపించారు.. అవినీతి సొమ్ము నిల్వ చేసుకోవడంలో జగన్ బిజీ అవ్వడం వలనే రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చిందని కామెంట్ చేశారు.