Site icon NTV Telugu

లోకేష్ శవ రాజకీయాలకు పాల్పడుతున్నారు : హోంమంత్రి

నారా లోకేష్ పై హోంమంత్రి సుచరిత మండిపడ్డారు. లోకేష్ శవ రాజకీయాలకు పాల్పడుతున్నారు. వ్యక్తిగత కారణాలతో జరుగుతున్న ఘటనలకు కూడా రాజకీయ రంగులు పులుముతున్నారు. కర్నూలు జిల్లాలో జరిగిన హత్యలు వ్యక్తిగత కారణాలతో జరిగిందని ప్రజలు చెబుతున్నారు. ఇది రాజకీయ ఘటన కాదు. ఘటనకు కారణం ఏంటో కూడా తెలుసుకోకుండా లోకేష్ అక్కడికి వెళ్లి రాజకీయ లబ్ధి పొందాలని చూశాడు. లోకేష్ ప్రజలను రెచ్చగొడుతున్నారు. గత ప్రభుత్వంలో 30కిపైగా రాజకీయ హత్యలు జరిగాయి అన్నారు.

Read Also : సంక్షోభం రాబోతోందని రాహుల్ గాంధీ ముందుగానే చెప్పారు…

ప్రభుత్వంపై కావాలనే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన తెలుగుదేశం నాయకులు ఇవాళ చిన్న చిన్న ఘటనలను అడ్డంపెట్టుకుని రాజకీయ లబ్ది పొందాలని కుంటున్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్రంలో ఏ రాజ్యాంగ నడిచిందో లోకేష్, చంద్రబాబు చెప్పాలి అని పేర్కొన్నారు. లోకేష్ ప్రతీకారం తీర్చుకుంటా అని చెబుతున్నాడు… అంటే మీరు వస్తే ఒకటికి పది మందిని చంపుతామని లోకేష్ చెప్పకనే చెబుతున్నారు. గతంలో కాల్ మనీ కేసులో ఏ విధంగా నిందితులను తప్పించారో ప్రజలందరికీ తెలుసు. మా ప్రభుత్వంలో తప్పు చేసినవారు ఎవరు తప్పించుకోవడానికి వీల్లేదు అని తెలిపారు.

Exit mobile version