Nimmala Ramanaidu : అంబటి చేసిన ఆరోపణలు నీటి మూటలు, నీటి మాటలని తేలిపోయాయి
- అంబటి ఆరోపణలు నీటి మూటలు, నీటి మాటలే
- గుంటూరు ఛానల్ రెగ్యులేటర్పై వైసీపీకి సమాధానం తెలియదని ఎద్దేవా
- బెజవాడ, ప్రకాశం బ్యారేజ్, తుంగభద్రపై అసత్య ప్రచారం మాత్రమే
- ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం వైసీపీ మీడియా లక్ష్యం -మంత్రి నిమ్మల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nimmala Ramanaidu : ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇటీవల వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, అవి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి చేసిన దుష్ప్రచారమని ఆయన విమర్శించారు. మంత్రి నిమ్మల మాట్లాడుతూ, “అమరావతిని లేపడానికి పొన్నూరును ముంచేశారంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు నీటి మూటలు, నీటి మాటలు మాత్రమే. అసలు విషయాలు వారికి తెలియకపోయినా అబద్ధాలు చెబుతూ భయాందోళనలు సృష్టిస్తున్నారు” అని అన్నారు. గుంటూరు ఛానల్ హెడ్ రెగ్యులేటర్ స్థితి గురించి అడిగితే స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయారని మంత్రి ఎద్దేవా చేశారు.
Visakhapatnam : విశాఖ ఉక్కు,ప్రైవేటీకరణ, లులూ మాల్ భూకేటాయింపుపై విపక్షాల పోరాటం
Also Read
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 1 నుంచి ప్రారంభం..
- Indrakeeladri: ఆషాఢ సారె ఉత్సవాలు.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు..
- AP Covid Cases: ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. నేటికి ఆ సంఖ్య ఎంతకు చేరిందంటే..
- Donkey Wedding: వర్షాలు కురవాలని గాడిదలకు ఘనంగా పెళ్లి.. కళ్యాణదుర్గంలో వినూత్న సంప్రదాయం!
అంతేకాదు, చేబ్రోలు, తాడికొండ, మంగళగిరి, పెదకాకాని మండలాల్లో 200 నుండి 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన విషయం కూడా వైసీపీ నేతలకు తెలియదని విమర్శించారు. వైసీపీ నేతలు కేవలం పొన్నూరు గురించే కాకుండా, ప్రకాశం బ్యారేజ్ గేట్లు పనిచేయడం లేదంటూ, బెజవాడ మునిగిపోతుందంటూ, కాపర్ డ్యాం కొట్టుకుపోతుందంటూ, తుంగభద్ర గేట్లు లేవడం లేదంటూ నిత్యం అసత్యాలే ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. “వైసీపీ మీడియా, సోషల్ మీడియా కలిసికట్టుగా ప్రజల్లో భయాన్ని, అనుమానాలను రేకెత్తిస్తూ అశాంతి వాతావరణం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయి. నేతి బీరకాయలో నెయ్యి ఉండదన్నట్లుగానే వైసీపీ నేతల మాటల్లో నిజాయితీ ఉండదు” అని మంత్రి నిమ్మల రామానాయుడు ఘాటుగా వ్యాఖ్యానించారు.
YSRCP vs TDP Fight: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై టీడీపీ, వైసీపీ కార్పొరేటర్ల మధ్య తోపులాట..
తాజావార్తలు
-
AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 1 నుంచి ప్రారంభం..
-
Dreaming: మీరు చనిపోయినట్లు కల వస్తుందా? షాక్ అయ్యే నిజం ఇదే!
-
Se*xual Harassment : పోలీస్ అకాడమీలో పోకిరి.. లేడీ ట్రైనీ IPSపై లైంగిక వేధింపులు..
-
FIFA World Cup 2026 Final: స్పెయిన్ VS అర్జెంటీనా.. గెలిచేది ఎవరో చెప్పిన రొనాల్డో
-
ROKO: చరిత్ర స్పష్టించిన రోహిత్, విరాట్ కోహ్లీ.. ఇంకా ఎన్ని రికార్డులు అందుకుంటారో..
ట్రెండింగ్
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!