Nimmala Ramanaidu : అంబటి చేసిన ఆరోపణలు నీటి మూటలు, నీటి మాటలని తేలిపోయాయి
- అంబటి ఆరోపణలు నీటి మూటలు, నీటి మాటలే
- గుంటూరు ఛానల్ రెగ్యులేటర్పై వైసీపీకి సమాధానం తెలియదని ఎద్దేవా
- బెజవాడ, ప్రకాశం బ్యారేజ్, తుంగభద్రపై అసత్య ప్రచారం మాత్రమే
- ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం వైసీపీ మీడియా లక్ష్యం -మంత్రి నిమ్మల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nimmala Ramanaidu : ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇటీవల వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, అవి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి చేసిన దుష్ప్రచారమని ఆయన విమర్శించారు. మంత్రి నిమ్మల మాట్లాడుతూ, “అమరావతిని లేపడానికి పొన్నూరును ముంచేశారంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు నీటి మూటలు, నీటి మాటలు మాత్రమే. అసలు విషయాలు వారికి తెలియకపోయినా అబద్ధాలు చెబుతూ భయాందోళనలు సృష్టిస్తున్నారు” అని అన్నారు. గుంటూరు ఛానల్ హెడ్ రెగ్యులేటర్ స్థితి గురించి అడిగితే స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయారని మంత్రి ఎద్దేవా చేశారు.
Visakhapatnam : విశాఖ ఉక్కు,ప్రైవేటీకరణ, లులూ మాల్ భూకేటాయింపుపై విపక్షాల పోరాటం
Also Read
- CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
- Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
- Dokka Seethamma Mid-Day Meal : స్మార్ట్ కిచెన్స్పై క్లారిటీ.. వంట కార్మికులకు గుడ్ న్యూస్.!
- CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
అంతేకాదు, చేబ్రోలు, తాడికొండ, మంగళగిరి, పెదకాకాని మండలాల్లో 200 నుండి 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన విషయం కూడా వైసీపీ నేతలకు తెలియదని విమర్శించారు. వైసీపీ నేతలు కేవలం పొన్నూరు గురించే కాకుండా, ప్రకాశం బ్యారేజ్ గేట్లు పనిచేయడం లేదంటూ, బెజవాడ మునిగిపోతుందంటూ, కాపర్ డ్యాం కొట్టుకుపోతుందంటూ, తుంగభద్ర గేట్లు లేవడం లేదంటూ నిత్యం అసత్యాలే ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. “వైసీపీ మీడియా, సోషల్ మీడియా కలిసికట్టుగా ప్రజల్లో భయాన్ని, అనుమానాలను రేకెత్తిస్తూ అశాంతి వాతావరణం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయి. నేతి బీరకాయలో నెయ్యి ఉండదన్నట్లుగానే వైసీపీ నేతల మాటల్లో నిజాయితీ ఉండదు” అని మంత్రి నిమ్మల రామానాయుడు ఘాటుగా వ్యాఖ్యానించారు.
YSRCP vs TDP Fight: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై టీడీపీ, వైసీపీ కార్పొరేటర్ల మధ్య తోపులాట..
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!