Minister Dadisetti Raja: గ్రౌండ్ రియాలిటీ అర్థమైపోయింది.. అందుకే చంద్రబాబు అలా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ధ్వజమెత్తారు మంత్రి దాడిశెట్టి రాజా.. తునిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. గ్రౌండ్ రియాలిటీ చంద్రబాబుకు అర్థమైపోయింది.. అందుకే డైవర్షన్ పాలిటిక్స్ మొదలు పెట్టాడని విమర్శలు గుప్పించారు.. చంద్రబాబు మాటలు ఏపీ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్న ఆయన.. అబద్దాలు చెప్పి 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాడని ఆరోపించారు.. పోలవరం దగ్గర చంద్రబాబు డ్రామా చేశాడని మండిపడ్డారు.. పట్టి సీమ పేరుతో దోచుకున్నారు అని ఆరోపణలు గుప్పించారు. ఇక, పోలవరం ప్రాజెక్టు వైఎస్ రాజశేఖర్రెడ్డికి పుట్టిన బిడ్డ, ఎవరికో పుట్టిన బిడ్డను నీకు పుట్టినట్లు చెప్పుకోవడానికి సిగ్గు లేదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. దత్తపుత్రుడితో కలిసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు.. మీ ఆటలు సాగవని హెచ్చరించారు దాడిశెట్టి రాజా..
Read Also: CM YS Jagan: గొప్పమనసు చాటుకున్న ఏపీ సీఎం.. నేను ఉన్నానంటూ భరోసా..
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
- Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
- AP Govt: రైతులకు, భూ యజమానులకు బిగ్ రిలీఫ్.. మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం..
ఇక, యనమల రామకృష్ణుడు.. చంద్రబాబు హయాంలో ఆర్థిక మంత్రిగా వ్యవహరించారు.. ఇప్పుడు మాత్రం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు వస్తుంటే వద్దని లేఖలు రాస్తున్నాడు అంటూ ఫైర్ అయ్యారు మంత్రి దాడిశెట్టి రాజా… చంద్రబాబుకే కాదు తెలుగుదేశం వృద్ధ జంబుగాళ్లకు ఇవే చివరి ఎన్నికలు అని జోస్యం చెప్పారు.. ప్రజలు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని చెప్పుతో కొట్టబోతున్నారనంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.. మరోవైపు, తెలంగాణలో అమర్రాజా పెట్టుబడులపై స్పందిస్తూ… విస్తరణ కోసమే అమర్రాజా ప్లాంట్ తెలంగాణలో పెట్టుబడులు పెడుతుందన్నారు మంత్రి దాడిశెట్టి రాజా.. కాగా, నిన్న తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో.. పోలవరం మొక్కను నాటింది నేనే.. పోలవరం నా ప్రాణం.. ఎన్నోసార్లు పోలవరాన్ని సందర్శించా.. మరెన్నోమార్లు పనులపై సమీక్షలు నిర్వహించా.. 70 శాతానికి పైగా పోలవరం నిర్మాణం పూర్తిచేశానంటూ చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!