Minister Dadisetti Raja: గ్రౌండ్ రియాలిటీ అర్థమైపోయింది.. అందుకే చంద్రబాబు అలా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ధ్వజమెత్తారు మంత్రి దాడిశెట్టి రాజా.. తునిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. గ్రౌండ్ రియాలిటీ చంద్రబాబుకు అర్థమైపోయింది.. అందుకే డైవర్షన్ పాలిటిక్స్ మొదలు పెట్టాడని విమర్శలు గుప్పించారు.. చంద్రబాబు మాటలు ఏపీ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్న ఆయన.. అబద్దాలు చెప్పి 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాడని ఆరోపించారు.. పోలవరం దగ్గర చంద్రబాబు డ్రామా చేశాడని మండిపడ్డారు.. పట్టి సీమ పేరుతో దోచుకున్నారు అని ఆరోపణలు గుప్పించారు. ఇక, పోలవరం ప్రాజెక్టు వైఎస్ రాజశేఖర్రెడ్డికి పుట్టిన బిడ్డ, ఎవరికో పుట్టిన బిడ్డను నీకు పుట్టినట్లు చెప్పుకోవడానికి సిగ్గు లేదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. దత్తపుత్రుడితో కలిసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు.. మీ ఆటలు సాగవని హెచ్చరించారు దాడిశెట్టి రాజా..
Read Also: CM YS Jagan: గొప్పమనసు చాటుకున్న ఏపీ సీఎం.. నేను ఉన్నానంటూ భరోసా..
Also Read
- YS Jagan: ఇంధన పొదుపు అంటూ ప్రజల చెవిలో పువ్వులు.. మీరు మాత్రం ప్రైవేట్ చాపర్స్లో షికారు..!
- YS Jagan: చంద్రబాబు చెప్పిన ప్రకారం పెట్రోల్, డీజిల్పై రూ.8 తగ్గించాలి కదా..? జగన్ డిమాండ్
- TDP Politburo Meeting: నేడు టీడీపీ పొలిట్బ్యూరో కీలక భేటీ.. మహానాడు ఏర్పాట్లపై ప్రధాన చర్చ
- Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
ఇక, యనమల రామకృష్ణుడు.. చంద్రబాబు హయాంలో ఆర్థిక మంత్రిగా వ్యవహరించారు.. ఇప్పుడు మాత్రం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు వస్తుంటే వద్దని లేఖలు రాస్తున్నాడు అంటూ ఫైర్ అయ్యారు మంత్రి దాడిశెట్టి రాజా… చంద్రబాబుకే కాదు తెలుగుదేశం వృద్ధ జంబుగాళ్లకు ఇవే చివరి ఎన్నికలు అని జోస్యం చెప్పారు.. ప్రజలు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని చెప్పుతో కొట్టబోతున్నారనంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.. మరోవైపు, తెలంగాణలో అమర్రాజా పెట్టుబడులపై స్పందిస్తూ… విస్తరణ కోసమే అమర్రాజా ప్లాంట్ తెలంగాణలో పెట్టుబడులు పెడుతుందన్నారు మంత్రి దాడిశెట్టి రాజా.. కాగా, నిన్న తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో.. పోలవరం మొక్కను నాటింది నేనే.. పోలవరం నా ప్రాణం.. ఎన్నోసార్లు పోలవరాన్ని సందర్శించా.. మరెన్నోమార్లు పనులపై సమీక్షలు నిర్వహించా.. 70 శాతానికి పైగా పోలవరం నిర్మాణం పూర్తిచేశానంటూ చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Peddi Twist: ఢిల్లీ ఎపిసోడ్ ట్విస్ట్.. ‘ఉప్పెన’ క్లైమాక్స్ కంటే 100 రెట్లు ఎక్కువ!
-
Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. “ఎక్స్” అకౌంట్ నిలిపివేత..
-
Hardik Pandya-MI: ఒక కిచెన్లో చాలా మంది చెఫ్స్.. హార్దిక్ పాండ్యాకు బయటికి వెళ్లే సమయం వచ్చేసింది!
-
YS Jagan: ఇంధన పొదుపు అంటూ ప్రజల చెవిలో పువ్వులు.. మీరు మాత్రం ప్రైవేట్ చాపర్స్లో షికారు..!
-
OPPO Find X9s: ఒప్పో ఫైండ్ X9s వచ్చేసింది.. 50MP కెమెరా, 7025mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!