Site icon NTV Telugu

వన్ టైమ్ సెటిల్మెంట్ పథకాన్ని బలవంతంగా రుద్దదు : మంత్రి బొత్స

ప్రజల కోసం మంచి పథకం తీసుకుని వేస్తే టీడీపీ విమర్శలు చేస్తోంది అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇళ్ళ పట్టాలపై కూడా టీడీపీ ఇలానే అడ్డుకునే ప్రయత్నం చేసింది. కానీ నిన్న కోర్టు తీర్పుతో అందరికీ స్పష్టత వచ్చింది అని మంత్రి బొత్స తెలిపారు. వన్ టైమ్ సెటిల్మెంట్ పథకం పాదయాత్ర సమయంలో ప్రజలు వచ్చి అడిగిందే అని చెప్పిన ఆయన… ఈ వన్ టైమ్ సెటిల్మెంట్ పథకాన్ని బలవంతంగా రుద్దదు అని చెప్పారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చే వారికే రిజిస్ట్రేషన్ చేస్తుంది అని స్పష్టం చేసారు. ప్రభుత్వ ఉద్దేశాలకు విరుద్ధంగా టెక్కలి నియోజకవర్గంలో పంచాయతీ కార్యదర్శి ఉత్తర్వుల విడుదల చేశాడు. టెక్కలి నియోజకవర్గంలో పంచాయతీ కార్యదర్శి విడుదల చేసిన ఉత్తర్వుల వెనుక అచ్చెన్నాయుడు ఉండి ఉండవచ్చు అన్నారు. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేశాం అని మంత్రి బొత్స పేర్కొన్నారు.

Exit mobile version