NTV Telugu Site icon

Atchannaidu: పేదల ఆకలి తీర్చడానికి అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశాం..

Atchnaidu

Atchnaidu

Atchannaidu: శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో అన్న క్యాంటీన్లను వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి అంజలి ఘటించిన తర్వాత మంత్రి మాట్లాడుతూ.. శ్రీకాకుళం కార్పొరేషన్ పరిధిలో 2 అన్న క్యాంటీన్లు ప్రారంభించామన్నారు. డొక్కా సీతమ్మ నాడు ప్రతి ఒక్కరి కడుపు నింపారు.. టీటీడీలో ఉచిత అన్నదాన ట్రస్టు ఏర్పాటు చేసింది ఎన్టీఆర్.. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటినా నేటికీ చాలా మంది పేదలు మూడు పూటలా భోజనం దొరక్క ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పుకొచ్చారు. పేదల ఆకలి తీర్చడానికే అన్న క్యాంటీన్లు నాడు ఏర్పాటు చేశాం.. వాటిలో మూడు పూటల నాణ్యమైన భోజనాన్ని అందించాం.. కానీ, గత ప్రభుత్వం పేదల కడుపు కొట్టి అన్న క్యాంటీన్లు మూసేశారు అంటూ మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

Read Also: KTR: కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్నే కలచివేస్తోంది

కాగా, మా పార్టీ నేతలు స్వచ్ఛందంగా మొబైల్ అన్న క్యాంటీన్లు నిర్వహించామని అచ్చెన్నాయుడు వెల్లడించారు. ప్రజల ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. రాష్ట్ర వ్యాప్తంగా 99 అన్న క్యాంటీన్లు ప్రారంభించాం.. భవిష్యత్ లో మండల కేంద్రాలు, గిరిజన ప్రాంతాల్లోనూ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం.. ఇలాంటి మంచి కార్యక్రమానికి దాతలు సహకారం అవసరం.. హరే రామ హరే కృష్ణ సంస్థ సెంట్రలైజ్డ్ కిచెన్ నుంచి మంచి ఆహారం అందిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.