Site icon NTV Telugu

ఏపీ సర్కార్‌కు షాక్‌..సమ్మెకు దిగనున్న వైద్యాఆరోగ్య శాఖ ఉద్యోగులు

ఏపీలో ఇప్పటికే ఉద్యోగుల పీఆర్సీ అంశంతో జగన్‌ సర్కార్‌ సతమతమవుతుంటే ఏపీ వైద్యాఆరోగ్య శాఖ ఉద్యోగులు మరో బాంబ్‌ పేల్చారు. జగన్‌ సర్కార్‌కు ఊహించని షాక్‌ ఇచ్చారు. సాధారణ ఉద్యోగులతో పాటు తామూ సమ్మెకు వెళ్తామని వైద్యారోగ్య సిబ్బంది తెలిపింది. పీఆర్సీ సాధ‌న స‌మితి పిలుపు మేర‌కు ద‌శ‌ల వారి ఉద్యమానికి ఏపీ హెల్త్‌ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్‌ అసోసియేషన్‌ ( హంస‌) సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని పేర్కొన్నారు. ఏపీ హెల్త్ అడ్మినిస్ట్రేష‌న్ మెడిక‌ల్ స‌ర్వీసెస్ అసోసియేష‌న్( ఏపీ హంస‌) అధ్యక్షుడు అర‌వ పాల్ చెప్పారు.

Read Also:పీఆర్సీ జీవోలను రద్దు చేసి వెంటనే చర్చలకు పిలవాలి: విద్యాసాగర్‌రావు

పీఆర్సీ జివోలు ర‌ద్దు చేయాలని.. చర్చలు ముగిసే వ‌ర‌కు పాత జీతాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.11 పీఆర్సీ పై అశితోష్ మిశ్రా క‌మిటీ నివేదిక‌ను అమ‌లు చేయాలని.. ఈ పోరాటంలో డాక్టర్లు, న‌ర్సులు, పారామెడిక‌ల్ సిబ్బంది పాల్గొంటారని పేర్కొన్నారు. క‌రోనా ,ఇత‌ర వైద్య సేవ‌ల‌కు కొంత అంత‌రాయం ఏర్పడే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెగ్యుల‌ర్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, గ్రామ‌, వార్డు స‌చివాల‌య ఉద్యోగులు ఈ పోరాటంలో పాలు పంచుకుంటారని వారు తెలిపారు. డిమాండ్లు ప‌రిష్కారం కాకుంటే అత్యవసర వైద్య సేవ‌ల‌కు కూడా అంత‌రాయం ఏర్పడే అవకాశం ఉందని పెద్ద మనస్సుతో ఏపీ ప్రభుత్వం అర్ధం చేసుకోవాలని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.

Exit mobile version