ప్రభుత్వ భూముల వేలానికి లైన్ క్లియర్ అయ్యింది.. నిధుల సమీకరణకు ప్రభుత్వ భూముల వేలానికి ఉన్న సాంకేతిక అడ్డంకిని తొలగించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ మేరకు గతంలో జారీ చేసిన జీవోలో మార్పులు చేసింది.. 2012లో ప్రభుత్వ భూముల వేలంపై నిషేధం విధిస్తూ జారీ చేసిన జీవోకు మార్పులు చేసింది వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్… నిషేధం అంటూ నాటి జీవోలో పేర్కొన్న నిబంధనను తొలగిస్తూ ఈ ఏడాది సెప్టెంబర్లో ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.. ఇక, సెప్టెంబర్లో జారీ చేసిన ఉత్తర్వులని గురువారం జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో నోటిఫికేషన్ చేసింది వైఎస్ జగన్ ప్రభుత్వం. కాగా, ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు, నిధుల సమీకరణ కోసం ప్రభుత్వ భూములను వేలం వేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.. అందులో భాగంగా.. అడ్డంకిగా ఉన్న పాత ఉత్తర్వులను మార్చేసింది.
భూముల వేలానికి తొలగిన అడ్డంకులు.. ఆ నిబంధనలు తొలగింపు..
