Karthika Somavaram Rush: ఏపీలో కార్తీకం సందడి.. కిటకిటలాడుతున్న శైవాలయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కార్తీక సోమవారం కావడంతో శైవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పంచారామ క్షేత్రం శిరో భాగ నిలయం శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీకమాసం మొదటి సోమవారం కావడంతో తెల్లవారుజామున 3 గంటల నుండి స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. భారీగా క్యూలైన్లో భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు రుద్రాభిషేకం, పాసు పతాభిషేకం ఏక బిల్వార్చనలు, తో పాటు కార్తీక మాసంలో దీపారాధన చేయడం వల్ల ఎంతో విశిష్టమైన ఫలితాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకంతో దీపారాధనలు చేసేందుకు మహిళలు గోశాలలో దీపారాధనలు, చేస్తున్నారు చేస్తున్నారు అభిషేక మండపంలో భక్తులు అభిషేకాలు నిర్వహించుకుంటున్నారు.
Read ALso: Women Crime: ఖతర్నాక్.. బట్టల దుకాణంలో మహిళల హల్ చల్
Also Read
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
- OTR: గూడూరు వైసీపీలో ఇంచార్జ్ మార్పు చిచ్చు.. నేతలను బుజ్జగించేందుకు మిథున్ రెడ్డి ఎంట్రీ
- Amaravati Land Pooling: అమరావతిలో మరో విడత ల్యాండ్ పూలింగ్.. 1,654 ఎకరాల భూమి సమీకరణకు నోటిఫికేషన్..
తొలి కార్తీక సోమవారం కావడంతో అన్నవరం రత్నగిరి కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. తెల్లవారుజామున నుండే సత్యదేవుని వ్రతాలు సర్వదర్శనాలు ప్రారంభించారు ఆలయ అధికారులు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. ఇటు పార్వతీపురం మన్యం జిల్లాలో శైవాలయాల్లో సందడి నెలకొంది. సాలూరు పంచముఖి అలయములో బారులు తీరిన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తొలి కార్తీక సోమవారం కావడముతో తెల్లవారి 3గంటలకే దర్శనం కోసం వేచి వున్న భక్తులతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. తొలి కార్తీక సోమవారం కావడంతో పంచారామ క్షేత్రమయిన తూర్పుగోదావరి జిల్లాలోని ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయం, సామర్లకోట కుమార భీమేశ్వర స్వామి ఆలలయాలలో భక్తులు తరలివచ్చారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు.
రాజమండ్రిలో భక్తులతో కిటకిటలాడుతున్నాయి గోదావరి స్నానఘట్టాలు. కార్తీక సోమవారం పరమేశ్వరుడికి ప్రీతికరమైన రోజు. వేలాదిగా తరలివచ్చి గోదావరిలో కార్తీక స్నానాలు ఆచరిస్తున్నారు భక్తులు. దీంతో పుణ్య స్నానాలతో కిక్కిరిసిపోయాయి పుష్కరఘాట్, మార్కండేయ ఘాట్, కోటిలింగాల ఘాట్, గౌతమి ఘాట్. స్నానాలు ఆచరించి శివనామ స్మరణతో గోదావరి నదిలో కార్తీక దీపాలు వదులుతున్నారు మహిళలు. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా స్నానఘట్టాలను శుభ్రపరుస్తున్నారు మున్సిపల్ కార్పోరేషన్ శానిటరీ సిబ్బంది.
ఉమ్మడి గుంటూరు జిల్లాలోని శైవ క్షేత్రాలలో భక్తులు పోటెత్తారు. కోటప్పకొండ, అమరావతిలతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రధాన ఆలయాల్లో తెల్లవారుజాము నుండి భక్తుల సందడి నెలకొంది. అమరావతి కృష్ణా నది పుష్కర ఘాట్, సూర్య లంక తీరం లలో పవిత్ర స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు భక్తులు. చలి తీవ్రంగా వున్నా.. చన్నీటి స్నానాలు చేస్తూ భక్తి ప్రపత్తులతో పూజలు చేస్తున్నారు.
Read Also: Nellore Rotten Meat Seize: నెల్లూరులో నాన్ వెజ్ కొంటున్నారా? బాబోయ్ ఇది తెలుసా?
తాజావార్తలు
-
Dhananjaya de Silva: అదే మాకు పెద్ద తలనొప్పి.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kangana Ranaut: కృతి వివాదం.. కంగనా పాత రక్షాబంధన్ పోస్ట్ వైరల్.. నెటిజన్ల నుంచి ఊహించని ప్రశ్నలు!
-
R Praggnanandhaa: చరిత్ర సృష్టించిన ఆర్. ప్రజ్ఞానంద.. గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు
-
Lunar Eclipse 2026: ప్రారంభమైన చంద్రగ్రహణం (వీడియో).. సూతక కాలంపై పూర్తి వివరాలు?
-
Ghamasaan OTT: అర్షద్ వార్సీ, ప్రతీక్ గాంధీ ఢీ.. అదరగొట్టిన ‘ఘమాసాన్’ ట్రైలర్ .. నేరుగా ఓటీటీలోకే
ట్రెండింగ్
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
-
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!