Site icon NTV Telugu

Kakinada Accident: ఇంజినీరింగ్‌ విద్యార్థిని ప్రాణం తీసిన పోలీసుల భయం.. హాల్‌ టికెట్‌ తీసుకొని వెళ్తూ తిరిగిరాని లోకాలకు

Road Accident

Road Accident

Kakinada Accident: కాకినాడ జిల్లాలో పోలీసుల తనిఖీల భయం ఓ విద్యార్థిని ప్రాణాలు తీసింది.. మరో విద్యార్థిని తీవ్రగాయాల పాలయ్యాడు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సుంకరపాలెం జంక్షన్ లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారనే అనుమానం ఇంజనీరింగ్ స్టూడెంట్ ప్రాణం తీసింది.. మోమిన్ అనే విద్యార్థిని బీటెక్ చదువుతుంది.. కాలేజీకి వెళ్లి హాల్ టికెట్ తీసుకుని స్నేహితురాలితో కలిసి ఇంటికి తిరిగి వస్తుండగా ఆ రూట్ లో పోలీసులు నిలబడి ఉన్నారు.. ఏపీ యానాం సరిహద్దు చెక్ పోస్ట్ కావడంతో పోలీసులు రెగ్యులర్ గా అక్కడ తనిఖీలు చేస్తారు .. యానాంలో మద్యం రేటు తక్కువగా ఉండడంతో అక్రమంగా అక్కడి నుంచి ఏపీకి మందు తీసుకుని వచ్చే వారిపై తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేస్తారు .. అయితే అక్కడ ఉన్న పోలీసులను పోలీసులను చూసి భయపడి విద్యార్థిని బైక్ వేగం పెంచి ఎక్సైజ్ శాఖకు చెందిన బారికేడ్ ను ఢీ కొట్టి రన్నింగ్ లో ఉన్న బస్సును ఢీ కొట్టింది.. దాంతో మోమిన్ అక్కడికక్కడే చనిపోయింది.. బైక్ వెనుక ఉన్న మరో మోమిన్ ఫ్రెండ్ తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్ కి తరలించారు.. పోలీసులు లైసెన్సు , హెల్మెట్ లేని వాళ్లపై కేసులు నమోదు చేస్తున్నారేమో అని భయపడి కేసు అవుతుందేమోనని మోమిన్ ప్రాణాల మీదకు తెచ్చుకుంది..

Read Also: Food vlogger: వ్యూస్ కోసం ‘‘డెవిల్ క్రాబ్’’ను తిన్న ఫుడ్ వ్లాగర్.. చివరకు..

Exit mobile version