Jayaprada: తెలుగు రాజకీయాల్లోకి అడుగుపెడతా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ నటి, పార్లమెంట్ మాజీ సభ్యురాలు, బీజేపీ నేత జయప్రదకు తెలుగు రాజకీయాల్లోకి రావాలని ఉందంటోంది. స్వతహాగా తెలుగు మహిళనైన తనకు తెలుగు రాజకీయాల్లో అడుగుపెట్టాలని ఆశగా ఉందని జయప్రద అన్నారు. బీజేపీ కేంద్ర నాయకత్వం ఆ దిశగా ఆదేశాలు ఇస్తే పార్టీ గెలుపునకు కృషి చేస్తానన్నారు. తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు పాలనను గాలికి వదిలేసాయని బీజేపీ పార్టీ ఆ దిశగా పోరాటం చేస్తుందన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజల సమస్యలను పరిష్కరించిన తరువాతే దేశ రాజకీయాల్లోకి వెళ్లాలని జయప్రద సూచించారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని బార్బీ స్కిన్ అండ్ లేజర్ క్లినిక్ ను ఆమె ప్రారంభించారు. బొల్లి మచ్చలు ఉన్న వారు నిరాశ చెందొవద్దని … అత్యాధునిక టెక్నాలజీ , ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చిందని జయప్రద అన్నారు. మహిళలు అందంపై ఎక్కువ మక్కువ చూపుతారని… తమ అందానికి మచ్చలు అడ్డుకాదని గ్రహించాలన్నారు. బార్బీ స్కిన్ కేర్ క్లినిక్ లో అనుభవం కలిగిన వైద్యులు ఉన్నారని… మహిళలు తమ అందాన్ని బార్బీ ద్వారా మెరుగుపరుచుకోవచ్చు అన్నారు.
Also Read
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
తెలుగు చిత్రాల్లో తనకంటూ గుర్తింపు పొందిన జయప్రద గతంలో టీడీపీలో ఆమె పనిచేశారు. రాజమండ్రికి చెందిన జయప్రద తన గత 28 ఏళ్ల రాజకీయ జీవితంలో అనేక పార్టీలు మారారు. 1994లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టిఆర్ ఆహ్వానం మేరకు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎన్టీఆర్ నుండి పార్టీ పగ్గాలను చంద్రబాబు చేతిలోకి తీసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు 1996లో జయప్రదను రాజ్యసభ సభ్యురాలిగా మరియు పార్టీ మహిళా విభాగం నాయకురాలిగా చేశారు.
వివిధ కారణాల వల్ల పార్టీలో విభేదాలు వచ్చాయి. జయప్రద తర్వాత ఏపీ నుంచి యూపీ రాజకీయాలకు మారారు. 2004లో రాంపూర్ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. మళ్ళీ 2009లో తిరిగి ఎన్నికయ్యారు. తాజాగా తిరిగి తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారాలనుకుంటున్నట్లు తన మనసులోని మాట చెప్పారు. అయితే ఆమె ఏపీ రాజకీయాలవైపే ప్రధానంగా ఆసక్తితో ఉన్నారని తెలుస్తోంది. 019లో బీజేపీలో చేరిన జయప్రద.. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ పార్టీ క్యాడర్లో ఉన్నందున తెలంగాణా లేదా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చేరే విషయంలో పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకోవాల్సి వుంది.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!