Cold Intensity: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న చలి తీవ్రత.. పడిపోతున్న ఉష్ణోగ్రతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cold Intensity: తెలుగు రాష్ట్రాల్లో చలి వాతావరణం క్రమంగా పెరుగుతోంది. రాత్రివేళల్లోనే కాకుండా పగటిపూట కూడా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మరోవైపు మరో మూడు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరగనుంది. తెలంగాణ, ఏపీలో ఉష్ణోగ్రతలు మరింత పడిపోతున్నాయి. చలి విపరీతంగా ఉండడంతో ప్రజలు వణికిపోతున్నారు. పగటిపూట కూడా ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటాయి. గడ్డకట్టే చలితో రాష్ట్రం వణికిపోతోంది. పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో అన్ని ప్రాంతాల్లో చలి వాతావరణం నెలకొంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాలు చలితో వణుకుతున్నాయి.
Read also: Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం..
Also Read
- CM Chandrababu: అమరావతి 2.0 ఇంటిగ్రేటేడ్ మాస్టర్ ప్లాన్ పై సీఎం సమీక్ష.. ప్రపంచస్థాయి నగరంగా..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
- Deputy CM Pawan Kalyan: సీఎస్, డీజీపీకి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లేఖ.. పోక్సో కేసులపై కీలక సూచనలు
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలో 12.3 డిగ్రీలు, నిర్మల్ జిల్లా పెంబిలో 13.1 డిగ్రీలు, సిద్దిపేట జిల్లా కొండపాకలో 13.5 డిగ్రీలు, జగిత్యాల జిల్లా మల్లాపూర్లో 13.6 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా జిన్నారంలో 13.9 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా కోపాల భూషణ్పల్లిలో 13.9 డిగ్రీలు. జిల్లా, పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో 13.9 డిగ్రీలు. 14.2 డిగ్రీలు, మెదక్ జిల్లా దామరంచలో కనిష్ట ఉష్ణోగ్రత 14.3 డిగ్రీలుగా నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో రాత్రిపూట మాత్రమే చలిగాలులు నమోదవుతుండగా.. తొలిసారి ఆదివారం పగటిపూట సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. మహబూబ్నగర్లో 27.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా, 3 డిగ్రీలు తగ్గి 30.6 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. రానున్న రెండు రోజుల పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 11 నుంచి 15 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో పొగమంచు కురుస్తోంది. ప్రధాన రహదారులపై పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి.
Read also: Gandhi Bhavan: నేడు గాంధీభవన్లో పీఏసీ కీలక భేటీ.. నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చ?
ఇక ఏపీ ఏపీలో కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉంది. నేడు, రేపు దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈరోజు రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలుచోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. విశాఖలోని ఏజెన్సీ గ్రామాలు వణికిపోతున్నాయి. చలి భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. ఇక చలి ఉత్తర భారతాన్ని భయపెడుతోంది.
తాజావార్తలు
-
Story Board : పంజా విసురుతున్న ఎల్నినో.. ముంచుకొస్తున్న ఆహార సంక్షోభం..
-
USA: “నువ్వు ముస్లింవా?” అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
-
India U-19 vs Sri Lanka U-19: చరిత్ర సృష్టించిన భారత యువ ఓపెనర్లు.. రికార్డుల మోత
-
Tragedy: దమ్ముంటే హైదరాబాద్కు రమ్మన్నాడు.. నిజంగానే వచ్చి చంపేశారు.. ఏం జరిగిందంటే..
-
Iran: ఇరాన్ నెక్ట్స్ టార్గెట్ ఇదేనా? మరో సంక్షోభం రానుందా?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!