NTV Telugu Site icon

Rain Alert: ఏపీలో రేపటి నుంచి భారీ వర్షాలు.. ఆ జిల్లాలో పిడుగులు పడే ఛాన్స్..?

Rain

Rain

Rain Alert: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ సూచించింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా 2-3 రోజుల్లో మరింత బలపడి ఒడిశా తీరం వైపు కదిలే అవకాశం ఉంది అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో రేపు ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని పేర్కొనింది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. అలాగే విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది.

Read Also: Darling: డార్లింగ్ సినిమాలో మరో కుర్ర హీరో.. ఎవరంటే?

ఇక, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. వరద ప్రవహించే వాగులు, కాలువలను ప్రజలు దాటే ప్రయత్నం చేయరాదు అని అధికారులు సూచించారు. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం.. పొలాల్లో పని చేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు- గొర్రెల కాపరులు చెట్లు క్రింద ఉండరాదు అని ప్రకటించింది. గురువారం సాయంత్రం 7 గంటల నాటికి ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో 137 మిల్లి మీటర్ల అధిక వర్షపాతం నమోదు అయిందని వెదర్ డిపార్ట్మెంట్ తెలిపింది. కొయ్యలగూడెంలో 111 మి.మీ, కోనసీమ జిల్లా మండపేటలో 96 మి. మీ, తూర్పు గోదావరి జిల్లా కడియంలో 92 మి. మీ, నిడదవోలులో 91 మి.మీ వర్షపాతం నమోదు అని సూచించింది. 18 ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు కాగా.. 85 ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు నమోదు అయినట్లు తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాధ్ చెప్పుకొచ్చారు.