Rain Alert: అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపుతోంది. రానున్న మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు తాజాగా బులెటిన్ను విడుదల చేసింది. దక్షిణాది రాష్ట్రాల్లో బంగాళాఖాతం నుంచి ఈస్టర్ గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో గురువారం పలుచోట్ల వర్షం కురిసింది. దక్షిణ కోస్తాలో పలుచోట్ల భారీ వర్షాలు, రాయలసీమలో పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడటంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 26వ తేదీ వరకు పలు ప్రాంతాల్లో అడపాదడపా వర్షాలు కురుస్తాయని, అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్లో ఉదయం పూట పొగమంచుతో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని పేర్కొంది.
Read also: Vande Bharat: వందేభారత్ పై మరోసారి రాళ్ల దాడి..
Also Read
- OTR: టీడీపీ - జనసేన ఇంచార్జ్ల మధ్య పెరుగుతున్న గ్యాప్..?
- Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
- Minister BC Janardhan Reddy: రూ.8,530 కోట్లతో రహదారుల అభివృద్ధి.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
ఏపీలో ఓ మోస్తరు ఆవర్తనంతో వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఏపీలోని కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 25న దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం మూసుకుంటోందని, దీని కారణంగా 26న అల్పపీడనం ఏర్పడి ఆ తర్వాత అది బలపడి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. బాపట్ల జిల్లా కూచినపూడిలో 50.25, ఏలూరు జిల్లా నూజివీడులో 47.25, కృష్ణా జిల్లా భదేవరపల్లిలో 45.5, అన్నమయ్య జిల్లా వెలిగల్లులో 38 మి.మీ వర్షపాతం నమోదైంది. ఈ వర్షానికి పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని వరి, పత్తికి స్వల్ప నష్టం వాటిల్లింది. వరి పైరు కోసి, ఓదెలపై ఉన్న పనులు, నూర్చి, ఆరబోసిన ధాన్యం తడిసింది. కొన్ని చోట్ల ధాన్యం కుప్పలు తడిసి రైతులు ఇబ్బందులు పడ్డారు. ఈ వర్షం కారణంగా దక్షిణ కోస్తా జిల్లాల్లోని పత్తి పొలాల్లో పండించిన పత్తి కూడా కొద్దిగా తడిసింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు వరి, పత్తి రైతులకు నష్టం కలిగిస్తుండగా.. ఇతర పంటలకు జీవం పోస్తోంది. గత వారం బంగాళాఖాతంలో తుపాను వచ్చినా రాష్ట్రంలో అంతగా ప్రభావం చూపలేదు. దీంతో వరి, పత్తి రైతులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అలాగే రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి ఐదు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి.
Telangana Election 2023: నవంబర్ 30 హాలీడే కాదు.. ఓటింగ్ డే..
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!