Home Minister Anita: పోలీసులకు కోటి రూపాయల వరకు బీమా కల్పించాం..
- వెలగపూడిలో కొత్త సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయం ప్రారంభం..
- రాజధాని కోసం రైతులు భూములు త్యాగం చెయ్యడం గొప్ప విషయం..
- పోలీసులకు కోటి రూపాయల వరకు బీమా కల్పించాం: హోంమంత్రి అనిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Home Minister Anita: గుంటూరు జిల్లాలోని తుళ్లూరు మండలం వెలగపూడిలో కొత్త సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయాన్ని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రారభించింది. ఈ కార్యక్రమంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ రోజు తుళ్లూరు పోలీస్ సబ్ డివిజన్ నూతన కార్యాలయం ప్రారంభిoచడం సంతోషంగా ఉందన్నారు. దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.. 2014లో సీఎం చంద్రబాబు అమరావతి ప్రారంభించారు.. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది.. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కార్యాలయం పూర్తి కాకుండా ఉందని మంత్రి అనిత పేర్కొన్నారు.
Read Also: Kerala State Film Awards 2025 : 10 అవార్డులు దక్కించుకుని సంచలనం సృష్టించిన మలయాళ చిత్రం..
Also Read
- Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
- Ambati Rambabu: ఏఐ వీడియో వివాదంలో అంబటి రాంబాబు.. కేసు నమోదు..
- Mudragada Padmanabham సంతాప సభలో ఆసక్తికర దృశ్యం.. ఆలింగనం చేసుకున్న బోండా ఉమ, అంబటి రాంబాబు.!
- Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
అయితే, రాజధాని కోసం రైతులు భూములు త్యాగం చెయ్యడం గొప్ప విషయం అని వంగలపూడి అనిత తెలిపింది. అమరావతి రైతుల కష్టం.. ప్రతి ఫలమే ఇవాళ అందరూ చూస్తున్నారు.. ఈ బిల్డింగ్ పూర్తి చెయ్యడానికి ఎస్పీ వకుల్ జిందాల్, డీఎస్పీ మురళీ కృష్ణ చాలా కృషి చేశారని గుర్తు చేసింది. పోలీస్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు డీజీపీ కృషి చేస్తున్నారు.. పోలీసులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.. పోలీసులకు కోటి రూపాయలు వరకు భీమా కల్పించాం అని వెల్లడించింది. కల్పిత వీడియోల ద్వారా చాలా మంది ఇబ్బంది పెడుతున్నారు.. అలాంటి వాటిని సమర్ధవంతంగా ఏపీ పోలీసులు ఎదుర్కొంటున్నారని హోంమంత్రి అనిత చెప్పుకొచ్చింది.
ఇక, ఈ మధ్య కాలంలో ఉత్తరప్రదేశ్ లో లారీపై రాళ్లు వేసిన వీడియో.. ఏపీలో జరిగినట్లు వైసీపీ ప్రచారం చేసిందని మంత్రి వంగలపూడి అనిత పేర్కొనింది. ఇలాంటి తప్పుడు ప్రచారాలను సమర్థవంతంగా ఏపీ పోలీసులు ఎదుర్కొన్నారు.. టెక్నాలజీ ఉపయోగించి తప్పుడు వార్తలు స్ప్రెడ్ కాకుండా చూడాలని సీఎం ఆదేశించారు.. కూటమి ప్రభుత్వం వచ్చాకే 6 వేల100 మంది కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చాం.. వైసీపీ ప్రభుత్వంలో ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగం కూడా ఇవ్వలేదు.. చనిపోయిన పోలీసు కుటుంబానికి అండగా ఉంటాం.. బీమా ద్వారా కనిష్టంగా రూ. 15 లక్షలు ఇవ్వడం జరుగుతుంది.. ఈ సబ్ డివిజన్ లో సిబ్బంది కొరత ఉంది.. త్వరలో అన్నీ భర్తీ చేస్తామని వంగలపూడి అనిత హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
10.1 అంగుళాల టచ్స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్తో Suzuki e-Sky లాంచ్..!
-
Road Accident: చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి, 8 మందికి తీవ్ర గాయాలు!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
GV Narayana Rao: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు కన్నుమూత
-
Sandeep Reddy Vanga: ప్రభాస్ ‘స్పిరిట్’ vs మహేశ్ ‘వారణాసి’.. క్లాష్పై వంగా కామెంట్ వైరల్!
ట్రెండింగ్
-
165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?