Ballikurava Quarry Tragedy: గ్రానైట్ క్వారీ ప్రమాదంలో ఆరుగురు మృతి.. సీఎం చంద్రబాబు విచారం!
- బాపట్ల: బల్లికురవ సమీపంలోని గ్రానైట్ క్వారీలో ప్రమాదం..
- గ్రానైట్ రాళ్లు విరిగిపడి, ఆరుగురు మృతి.. మరికొందరికి గాయాలు..
- క్వారీ ప్రమాదంపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ విచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ballikurava Quarry Tragedy: బాపట్ల జిల్లా బల్లికురవ సమీపంలోని సత్య కృష్ణ గ్రానైట్ క్వారీలో అంచు విరిగి పడిన ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మృతులు ఒరిస్సాకు చెందిన కార్మికులుగా గుర్తించారు. పని చేస్తుండగా గ్రానైట్ అంచులు విరిగి పడ్డాయి. మరికొంత మంది కార్మికులకు గాయాలు కాగా.. గాయపడిన వారిని నర్సరావుపేటలోని ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో క్వారీలో 15 మందికి పైగా కార్మికులు పని చేస్తున్నారు. క్వారీ యాజమాన్యం నిర్లక్ష్యంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
Read Also: Coolie: మొత్తనికి సత్యరాజ్తో విభేదాలపై స్పందించిన రజనీకాంత్..
Also Read
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Tenali: మహిళ సెల్ఫీ సూసైడ్ కలకలం.. పోలీసుల వేధింపులే కారణమంటూ ఆవేదన.!
- Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
- Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
ఇక, బల్లికురవ క్వారీ ప్రమాద ఘటనలో ఐదుగురు మృతి చెందడంతో పాటు మరి కొంత మంది తీవ్రంగా గాయపడిన ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఇంత మంది ప్రాణాలు కోల్పోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదంపై అధికారులతో మాట్లాడి, వివరాలను సేకరించిన సీఎం.. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
Read Also: LIC Bima Sakhi: మహిళల కోసం ఎల్ఐసీ గొప్ప పథకం.. ఒక్క రూపాయి కట్టకుండానే.. నెలకు రూ. 7000 పొందే ఛాన్స్
మరోవైపు, బాపట్ల జిల్లా బల్లికురవ సమీపంలోని గ్రానైట్ క్వారీలో బండరాళ్లు పడి పలువురు కార్మికులు దుర్మరణం పాలవడం నన్ను తీవ్రంగా కలచివేసింది అని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో రోజువారీ కూలీలు మృతి చెందడం బాధాకరం.. గాయపడిన వారికి అవసరమైన వైద్యసాయం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించడం జరిగింది.. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని నారా లోకేష్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Lorcan Tucker: టీమిండియాపై టీ20 సిరీస్ గెలిచామా.. నేను ఇంకా నమ్మలేకపోతున్నా!
-
US Iran Talks: అమెరికా–ఇరాన్ మధ్య శాంతి దిశగా కీలక అడుగు..
-
God Of War : సోషల్ మీడియాని షేక్ చేస్తున్న Jr. NTR – త్రివిక్రమ్ ‘గాడ్ ఆఫ్ వార్’
-
Peddi OTT Release: రామ్ చరణ్ ‘పెద్ది’ ఇప్పుడు ఇంట్లోనే.. కానీ ఈ ఒక్క భాషకు వెయిటింగ్ తప్పదు!
-
Astrology: జూన్ 29 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!