Ambati Rambabu New Case: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసుల పరంపర కొనసాగుతోంది.. అంబటిపై మరో పీటీ వారెంట్ జారీ చేయబడింది. సత్తెనపల్లి పోలీసులు రేపు ఆయనను కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ పీటీ వారెంట్ 2023లో సత్తెనపల్లిలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల లక్కీ డ్రా లాటరీకి సంబంధించి జారీ చేశారు. పింఛన్ లబ్ధిదారులలో 200 మందిని మినహాయించి, ఇతరులకు లక్కీ డ్రా టిక్కెట్లు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయని గాదె వెంకటేశ్వర రావు, జనసేన జిల్లా అధ్యక్షుడు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది.
Read Also: Telangana Municipal Elections: ముగిసిన తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు.. 13న ఫలితాలు..!
గతంలో వైద్యకళాశాలల ప్రైవేటీకరణ విధానంపై ఆందోళన కేసులో అంబటికి బెయిల్ మంజూరు అయినప్పటికీ, ఈ కొత్త పీటీ వారెంట్ ద్వారా ఆయనపై మరింత విచారణ కొనసాగుతుంది. మున్సిపల్ సివిల్ కోర్టు ఈ వారెంట్ జారీ చేసింది. సత్తెనపల్లి పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు రేపు అంబటిని హాజరుపరచనున్నారు, తద్వారా ఆయన విడుదల మరింత జాప్యం అయ్యే అవకాశం ఉంది.
