Illegal Affair: వీడిన మిస్టరీ.. మైనర్ బాలుడితో వివాహిత సహజీవనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gudivada Married Woman Illegal Affair With Minor Boy: ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన 15 బాలుడ్ని ఒక వివాహిత కిడ్నాప్ చేసిన మిస్టరీని పోలీసులు ఛేదించారు. అందరూ అనుమానించినట్టుగానే ఈ కేసులో షాక్కి గురి చేసే షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. మాయమాటలు చెప్పి ఆ బాలుడ్ని తీసుకెళ్లిన మహిళ.. హైదరాబాద్లో అతనితో సహజీవనం చేసినట్టు తేలింది. స్థానికంగా కలకలం రేపిన ఈ కేసుని సీరియస్గా తీసుకున్న పోలీసులు.. ఫోన్ లొకేషన్ ఆధారంగా వివాహితని అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే..
గుడివాడ పట్టణంలో ఓ వివాహిత మహిళ (31) తన భర్త, నలుగురు పిల్లలతో నివాసముంటోంది. చిన్నారులతో సెల్ ఫోన్లో వీడియో గేమ్స్ తరచూ ఆడే ఈ వివాహిత.. ఎదురింట్లో ఉండే 14 ఏళ్ల బాలుడి పట్ల ఆకర్షితురాలయ్యింది. అతడ్ని శారీరంగా లోబర్చుకుంది. దీంతో.. ఆ అబ్బాయి పాఠశాలకు వెళ్లకుండా తరచూ ఆమె ఇంటికి వెళ్లేవాడు. ఇది గమనించిన బాలుడి తల్లిదండ్రులు.. అతడ్ని మందలించారు. ఈ విషయం తెలుసుకున్న ఆ వివాహిత.. ఆ బాలుడు తనకు ఎక్కడ దూరమవుతాడోనన్న భయంతో ఎస్కేప్ ప్లాన్ వేసింది. అతనికి మాయమాటలు చెప్పి.. ఈనెల 19వ తేదీన బలవంతంగా హైదరాబాద్కు తీసుకెళ్లింది. హైదరాబాద్ బాలానగర్లో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని.. బాలుడితో సహజీవనం చేస్తోంది.
Also Read
- TDP vs YSRCP: టెంపుల్ సిటీలో టెన్షన్.. టెన్షన్.. టీడీపీ వర్సెస్ వైసీపీ
- Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
- AP Horror: మాఫియాలో చేరాలని ప్లాన్.. స్నేహితుడితో కలిసి తల్లిని హత్య చేసిన కొడుకు.. బంగారంతో పరారీ
- Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
తొలుత తమ అబ్బాయి కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలో ఎదురింట్లో ఆ వివాహిత కూడా మాయమైన విషయం తెలియడంతో.. ఆమెనే తమ పిల్లాడ్ని కిడ్నాప్ చేసిందని బాలుడి పేరెంట్స్ ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పట్నుంచే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కట్ చేస్తే.. కొన్ని రోజుల తర్వాత ఆ బాలుడు తిరిగి ఇంటికి వెళ్లిపోవాలని అనుకున్నాడు. డబ్బులు లేకపోవడంతో.. తనకు డబ్బులు పంపాలని స్నేహితులు, చుట్టుపక్కల వారికి మెసేజ్ చేశాడు. ఎవరూ స్పందించకపోవడంతో నేరుగా తల్లిదండ్రులకే ఫోన్ చేసి.. తాను హైదరాబాద్లో ఉన్నానని, ఇంటికి వస్తానని చెప్పాడు.
అప్పటికే బాలుడి కోసం కొన్ని ప్రత్యేక పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలోనే బాలుడు ఫోన్ చేసిన విషయం తెలిసి, అతడు మాట్లాడుతున్నప్పుడే సెల్ఫోన్ లొకేషన్ని పసిగట్టారు. మంగళవారం రాత్రి వారి ఇంటికి వెళ్లి.. ఇద్దరినీ అదుపులోకి తీసుకొని, బుధవారం గుడివాడకు తీసుకొచ్చారు. బాలుడికి కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు.. వివాహితపై కిడ్నాప్, ఫోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి రిమాండ్ విధించారు.
తాజావార్తలు
-
‘DC’ : క్రిమినల్స్ లవ్ స్టోరీతో వస్తున్న లోకేష్ కనగరాజ్..‘DC’ ట్రైలర్ వైరల్
-
Pradeep :తల్లిదండ్రులకు తెలియకుండా పదేళ్ల పోరాటం.. ‘తిమ్మరాజుపల్లి టీవీ’ రాజప్ప రియల్ స్టోరీ ఇదే!
-
Virat Kohli: “నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు”.. వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిపడేశాడుగా.!
-
Green Invicta: గ్రీన్ ఇన్విక్టా ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.45000 డిస్కౌంట్.. చౌక ధరకే సొంతం చేసుకోండి.. 60KM రేంజ్
-
Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..