Gudivada Amarnath : చంద్రబాబు చూసి ఉత్తరాంధ్ర ప్రజలు అస్యహించుకుంటున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజశేఖర్ రెడ్డి కుటుంబం కంటే టీడీపీ హయాంలో ఎక్కువ అభివృద్జి జరిగిందని నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పకుంటానని వైస్సార్సీపీ అధికార ప్రతినిధి గుడివాడ అమరనాథ్ అన్నారు. చంద్రబాబు చూసి ఉత్తరాంధ్ర ప్రజలు అస్యహించుకుంటున్నారని ఆయన విమర్శించారు. అమరావతి ప్రజల రాజధాని కాదు పెట్టుబడిదారుల రాజధాని అని, ఉత్తరాంధ్ర రాయలసీమ మీద చంద్రబాబు విషం చిమ్ముతున్నారని ఆయన ఆరోపించారు. సీఆర్డీఏ అంటే చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపార అని, ఉత్తరాంధ్రకు వచ్చి చంద్రబాబుకు ఓటు అడిగే హక్కు లేదని ఆయన అన్నారు. శాసనసభకు రాజధానిపై నిర్ణయం తీసుకునే హక్కు లేదని న్యాయస్థానం చెప్పిందని, గౌరవ న్యాయస్థానం తీర్పును మేము గౌరవిస్తామని ఆయన అన్నారు. శాసనసభ వేదిక చంద్రబాబు రాజధానిపై నిర్ణయం తీసుకున్నారు.. అదే తీర్పు చంద్రబాబుకు ఎందుకు వర్తించదో నాకు అర్ధం కాలేదన్నారు.
శాసనసభ చట్టాలు చేయకపోతే ఇక మా పని ఏమిటో అర్థం కాలేదని, ప్రజాస్వామ్యంలో ఒక పిల్లర్ కు పని లేదని చెపితే ఎలా..? అని ఆయన ప్రశ్నించారు. మూడు రాజధానులు బిల్లు మళ్లీ ప్రవేశ పెడతామని ఆయన స్పష్టం చేశారు. మూడు రాజధానుల బిల్లు ఈ సమావేశాల్లో పెడతమా వచ్చే సమావేశాల్లో పెడతమా అనేది సీఎం నిర్ణయం తీసుకుంటారన్నారు. బీజేపీ మేనిఫెస్టోకు వ్యతిరేకంగా సుజనా చౌదరి మాట్లాడుతున్నారని, కర్నూల్లో న్యాయ రాజధాని పెట్టాలని బీజేపీ మేనిఫెస్టోలో పెట్టిందన్నారు. కర్నూల్లో హైకోర్టు పెడతామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన బీజేపీ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. రఘురామకృష్ణమరాజు వంటి జోకర్ బ్రోకర్ లకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని మండిపడ్డారు.
Also Read
- Pydithalli Ammavari Jatara 2026: విజయనగరం పైడితల్లి జాతర షెడ్యూల్ ఇదే.. సిరిమాను ఉత్సవం ఎప్పుడంటే?
- AP Local Body Election: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వైరల్.. క్లారిటీ ఇచ్చిన ఎన్నికల సంఘం
- CM Chandrababu: రైతులు ఫుడ్ ప్రాసెసింగ్లోకి రావాలి.. వ్యవసాయాన్ని ఆర్థిక శక్తిగా మార్చాలి!
- Vijaysai Reddy: బీజేపీలో అస్సలు చేరను.. కొత్త పార్టీపై త్వరలోనే చెప్తా!
తాజావార్తలు
-
Irumudi: కథ విని రవితేజ కూతురు ఏడ్చేసింది.. సీక్రెట్స్ బయటపెట్టిన శివ నిర్వాణ!
-
MK Stalin: స్టాలిన్ సంచలన నిర్ణయం.. కొలత్తూరులో ఓటమిపై హైకోర్టులో పిటిషన్
-
LPG e-KYC చివరి తేదీ దాటింది.. ఇక సిలిండర్ రాదా? అసలు నిజం ఇదే!
-
Karumuri Nageswara Rao : కారుమూరికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్.. చంచల్గూడ జైలుకు తరలింపు
-
Jinping: భారీ బృందంతో ఢిల్లీకి వస్తున్న చైనా అధ్యక్షుడు.. బ్రిక్స్లో పాల్గొననున్న జిన్పింగ్
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!