Gas Leak: గ్యాస్ లీక్ ఘటనలో ఇద్దరి పరిస్థితి సీరియస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖపట్నం సమీపంలోని అచ్యుతాపురంలో అమ్మోనియా గ్యాస్ లీక్ ఘటనలో బాధితులకు చికిత్స అందుతోంది. అయితే ఇద్దరి పరిస్థితి సీరియస్ గా వుందని తెలుస్తోంది. అచ్యుతాపురం గ్యాస్ లీక్ ఘటనలో 8మందికి తీవ్ర అస్వస్థత వుంది. కేజీహెచ్ లో ఎమర్జెన్సీ వైద్యసేవలు కోసం తరలించారు. అనకాపల్లి ఏరియా ఆసుపత్రిలో 120మందికి చికిత్స అందిస్తున్నారు. గ్యాస్ లీక్ ప్రమాదంపై విచారణ ప్రారంభమైంది.
బ్రాండిక్స్ లో జరిగిందా లేక పక్కనే ఉన్న మరో కంపెనీ నుంచి లీక్ అయిందా అనేది నివేదికలో రానుంది. డిజిటల్ మీటర్ల ద్వారా గ్యాస్ లీక్ తీవ్రతను పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు. NTV తో అనకాపల్లి కలెక్టర్ రవిసుభాష్ మాట్లాడారు. మరోవైపు గ్యాస్ లీక్ బాధితులతో నిండిపోయింది అనకాపల్లి ఆసుపత్రి.ఆక్సిజన్ సపోర్ట్ తో వైద్య సేవలు అందిస్తున్నారు.
Also Read
- Andhra Pradesh Job Calendar: ఏపీలో రెండో దశ జాబ్ క్యాలెండర్.. సీఎస్ కీలక సమావేశం..
- Clash Between Punganur TDP Activits: కొట్టుకున్న పుంగనూరు తెలుగు తమ్ముళ్లు.. సమావేశం రద్దు
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీ ఆధునీకరణకు శ్రీకారం.. 117 కొత్త గేట్ల పనులు ప్రారంభించిన సీఎం!
- APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
ఒకేసారి ఎక్కువ సంఖ్యలో బాధితులు రావడంతో బెడ్స్ కోసం ఇబ్బంది తప్పడం లేదు. బెడ్స్ కెపాసిటీ 120 కాగా గ్యాస్ లీక్ బాధితుల సంఖ్యే 130వుంది. ఆసుపత్రి రద్దీ పెరగడంతో ఉషా ప్రైం, సత్యదేవ, అగనంపూడి పీహెచ్ సీలకు బాధితుల్ని తరలిస్తున్నారు. మరోవైపు NTR ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు, పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్. యాజమాన్యం వైఫల్యం కారణంగా ప్రమాదం జరిగిందని తెలితే కఠినంగా వ్యవహారిస్తాం అన్నారు మంత్రులు.
బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు తెలిపారు. విశాఖ కేజీహెచ్ కు చేరుకుంటున్నారు గ్యాస్ లీక్ ఘటన లో తీవ్ర అస్వస్థతకు గురైన బాధితులు. అత్యవసర విభాగం లో చికిత్స పొందుతున్న సత్యవతి, దమయంతి. బాధితుల ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. NTR ఆసుపత్రిలో గ్యాస్ లీక్ బాధితులకు అందుతున్న వైద్యసేవలపై ఉన్నతాధికారులు ఆరా తీశారు. 48గంటల పాటు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీఅయ్యాయి. గ్యాస్ లీక్ తర్వాత ఇళ్లకు వెళ్లిపోయిన కొంత మందికి స్వల్ప సమస్యలు వేధిస్తున్నాయి. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తుంది యంత్రాంగం.
విశాఖ జిల్లా అచ్యుతాపురం సెజ్ లో ప్రమాదం బాధాకరం అన్నారు అచ్చెన్నాయుడు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే అచ్యుతాపురంలో గ్యాస్ లీకేజీ జరిగిందన్నారు టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. బాధితులకు ప్రభుత్వం అండగా నిలవాలన్నారు.
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!