Gas Leak: గ్యాస్ లీక్ ఘటనలో ఇద్దరి పరిస్థితి సీరియస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖపట్నం సమీపంలోని అచ్యుతాపురంలో అమ్మోనియా గ్యాస్ లీక్ ఘటనలో బాధితులకు చికిత్స అందుతోంది. అయితే ఇద్దరి పరిస్థితి సీరియస్ గా వుందని తెలుస్తోంది. అచ్యుతాపురం గ్యాస్ లీక్ ఘటనలో 8మందికి తీవ్ర అస్వస్థత వుంది. కేజీహెచ్ లో ఎమర్జెన్సీ వైద్యసేవలు కోసం తరలించారు. అనకాపల్లి ఏరియా ఆసుపత్రిలో 120మందికి చికిత్స అందిస్తున్నారు. గ్యాస్ లీక్ ప్రమాదంపై విచారణ ప్రారంభమైంది.
బ్రాండిక్స్ లో జరిగిందా లేక పక్కనే ఉన్న మరో కంపెనీ నుంచి లీక్ అయిందా అనేది నివేదికలో రానుంది. డిజిటల్ మీటర్ల ద్వారా గ్యాస్ లీక్ తీవ్రతను పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు. NTV తో అనకాపల్లి కలెక్టర్ రవిసుభాష్ మాట్లాడారు. మరోవైపు గ్యాస్ లీక్ బాధితులతో నిండిపోయింది అనకాపల్లి ఆసుపత్రి.ఆక్సిజన్ సపోర్ట్ తో వైద్య సేవలు అందిస్తున్నారు.
Also Read
- YS Jagan: కూటమి ప్రభుత్వ పనితీరుపై జగన్ ఆసక్తికర ట్వీట్
- Vizag Adventure Sports : వైజాగ్ టూరిజంలో సరికొత్త థ్రిల్.. అదరగొడుతున్న సాహస క్రీడలు.!
- CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
- CM Chandrababu: సీఎం చంద్రబాబు బంపరాఫర్.. మూడో బిడ్డకు రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40 వేలు..
ఒకేసారి ఎక్కువ సంఖ్యలో బాధితులు రావడంతో బెడ్స్ కోసం ఇబ్బంది తప్పడం లేదు. బెడ్స్ కెపాసిటీ 120 కాగా గ్యాస్ లీక్ బాధితుల సంఖ్యే 130వుంది. ఆసుపత్రి రద్దీ పెరగడంతో ఉషా ప్రైం, సత్యదేవ, అగనంపూడి పీహెచ్ సీలకు బాధితుల్ని తరలిస్తున్నారు. మరోవైపు NTR ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు, పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్. యాజమాన్యం వైఫల్యం కారణంగా ప్రమాదం జరిగిందని తెలితే కఠినంగా వ్యవహారిస్తాం అన్నారు మంత్రులు.
బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు తెలిపారు. విశాఖ కేజీహెచ్ కు చేరుకుంటున్నారు గ్యాస్ లీక్ ఘటన లో తీవ్ర అస్వస్థతకు గురైన బాధితులు. అత్యవసర విభాగం లో చికిత్స పొందుతున్న సత్యవతి, దమయంతి. బాధితుల ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. NTR ఆసుపత్రిలో గ్యాస్ లీక్ బాధితులకు అందుతున్న వైద్యసేవలపై ఉన్నతాధికారులు ఆరా తీశారు. 48గంటల పాటు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీఅయ్యాయి. గ్యాస్ లీక్ తర్వాత ఇళ్లకు వెళ్లిపోయిన కొంత మందికి స్వల్ప సమస్యలు వేధిస్తున్నాయి. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తుంది యంత్రాంగం.
విశాఖ జిల్లా అచ్యుతాపురం సెజ్ లో ప్రమాదం బాధాకరం అన్నారు అచ్చెన్నాయుడు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే అచ్యుతాపురంలో గ్యాస్ లీకేజీ జరిగిందన్నారు టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. బాధితులకు ప్రభుత్వం అండగా నిలవాలన్నారు.
తాజావార్తలు
-
CJI Surya Kant: ‘‘నకిలీ డిగ్రీలతో వ్యవస్థను చెడగొడుతున్నారు’’.. కాక్రోచ్ వ్యాఖ్యలపై సీజేఐ క్లారిటీ
-
Navakanth : రామ్ చరణ్ కంటికి గాయం కావడంతో నాకు ఏడుపు వచ్చేసింది!
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. నాపై క్షుద్ర పూజలు.. ఆ ‘ఇడ్లీ నటి’ వల్లే నా బతుకు ఇలా.. జయం రవి కన్నీరు
-
Trump China Visit: చైనాను అస్సలు నమ్మని ట్రంప్.. చెత్త బుట్టలోకి చైనీస్ గిఫ్ట్స్..
-
YS Jagan: కూటమి ప్రభుత్వ పనితీరుపై జగన్ ఆసక్తికర ట్వీట్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..